రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్రమైన లక్షణం ఉంటుంది. వారు వీకైన ప్రతిసారీ.. సెంటిమెంటును.. ప్రత్యర్థులను నమ్ముకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిలో ముందున్నారు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. గతంలోను.. ప్రస్తుతం కూడా ఆయన తన బలం తగ్గుతోందని, ప్రజల్లో తన హవా కనిపించడం లేదని భావించిన ప్రతిసారీ.. ఇరు రాష్ట్రాల అంశాలను… ముఖ్యంగా ఏపీని ఆయన సాధనంగా చేసుకుని తెలంగాణలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును కార్నర్ చేసుకుని.. కేసీఆర్ నిచ్చెన వేసిన సందర్భాలు కూడా ఈ సమయంలో ప్రస్తావనార్హం. తెలంగాణ మలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టు కట్టిన చంద్రబాబు తెలంగాణలో పోటీచేశారు. ఆ సమయంలో మరోసారి ఆంధ్రోళ్లు మనపై పెత్తనానికి వస్తున్నరు.. అంటూ ఊరూవాడా కేసీఆర్ ప్రచారం చేశారు. ఇది ఆయనకు లాభించి.. రెండోసారి అధికారంలోకి వచ్చారు. కానీ, 2023లో ఆ అవకాశం లేకుండా పోయింది.
ఫలితంగా.. కేసీఆర్ సర్కారు పరాజయం పాలైంది. ఇక, అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పాలమూరు జలాల సమస్యను లేవనెత్తి తద్వారా.. ప్రజల అభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పదేళ్ల పాలనలో కేసీఆర్ `తలుచుకుని` ఉంటే.. కాళేశ్వరం కన్నా పెద్ద ప్రాజెక్టు కాని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఉండేవారు. ఇది.. ఆయన చేసిన తప్పు. కానీ.. దీనిని కప్పి పుచ్చుకునేందుకు 2014-18 మధ్య జరిగిన సంగతలు(అవి నిజమో కాదో తెలియదు) తెరమీదికి తెచ్చి.. చంద్రబాబును ఆడిపోసుకున్నారన్న వాదన వినిపించింది.
ఇక్కడ కేవలం పాలమూరు సమస్య మాత్రమే కేసీఆర్ లేవనెత్తితే..అర్థం చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు శిష్యుడు అంటూ.. రేవంత్ రెడ్డిని కూడా.. తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేయడం కేసీఆర్ రాజకీయ సెంటిమెంటు వ్యూహాన్ని బలపరుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ మాటకు సొంత పార్టీ నాయకులు విలువ ఇస్తున్నారో లేదో తెలియదు. ఇక, కుటుంబంలో కుంపటి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ఆయన వ్యూహాత్మకంగా తన బలాన్ని పెంచుకునేందుకు చంద్రబాబును పావుగా చేసుకుని నీటి యుద్ధాలకు తెరదీస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on December 22, 2025 2:37 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…