తెలంగాణలో కొత్త చట్టం తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలపై ఎవరి నిర్బంధం ఉండదన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నారు. మత విద్వేషాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కర్ణాటకలో కూడా ఇటీవల కొత్తచట్టం తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మతాలపైవిమర్శలు చేసేవారు, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కఠినంగా అణిచివేసేందుకు వీలుగా కర్ణాటకలో కొత్త చట్టం తీసుకువచ్చారని.. అలాంటి చట్టమే తెలంగాణలోనూ తీసుకురానున్నట్టు సీఎం చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. డిసెంబరు మాసానికి చాలా ప్రత్యేకత ఉందన్న సీఎం.. ఈ నెలలోనే తమ ప్రభుత్వం(2023) ఏర్పడిందన్నారు. ఇదే నెలలో ప్రభువు జన్మించారని.. అదేవిధంగా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా ఈ మాసంలోనేనని రేవంత్ చెప్పారు. అనేక మందిప్రాణ త్యాగాలు సహా కాంగ్రెస్ పార్టీ `రాజకీయ త్యాగం` చేసి తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ద్వేషించేవారిని కూడా ప్రేమించాలన్న స్ఫూర్తి నింపిన ఏసు ప్రభు సందేశమే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ బోధనల స్ఫూర్తితోనే పాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థికంగా,రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కులాలు, మతాలకు అతీతంగా తాము సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా అమలవుతున్న పథకాల జాబితాను వివరించారు. ఇదే సమయంలో క్రైస్తవ మిషినరీల ఏర్పాటు.. దేశవ్యాప్తంగా అవి చేస్తున్న కృషిని సీఎం రేవంత్ వివరించారు. ప్రభుత్వంతో పోటీ పడి మరీ మిషినరీలు సేవలు అందిస్తున్నాయని కొనియాడారు.
This post was last modified on December 21, 2025 9:06 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…