తెలంగాణలో కొత్త చట్టం తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలపై ఎవరి నిర్బంధం ఉండదన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నారు. మత విద్వేషాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కర్ణాటకలో కూడా ఇటీవల కొత్తచట్టం తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మతాలపైవిమర్శలు చేసేవారు, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కఠినంగా అణిచివేసేందుకు వీలుగా కర్ణాటకలో కొత్త చట్టం తీసుకువచ్చారని.. అలాంటి చట్టమే తెలంగాణలోనూ తీసుకురానున్నట్టు సీఎం చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. డిసెంబరు మాసానికి చాలా ప్రత్యేకత ఉందన్న సీఎం.. ఈ నెలలోనే తమ ప్రభుత్వం(2023) ఏర్పడిందన్నారు. ఇదే నెలలో ప్రభువు జన్మించారని.. అదేవిధంగా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా ఈ మాసంలోనేనని రేవంత్ చెప్పారు. అనేక మందిప్రాణ త్యాగాలు సహా కాంగ్రెస్ పార్టీ `రాజకీయ త్యాగం` చేసి తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ద్వేషించేవారిని కూడా ప్రేమించాలన్న స్ఫూర్తి నింపిన ఏసు ప్రభు సందేశమే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ బోధనల స్ఫూర్తితోనే పాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థికంగా,రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కులాలు, మతాలకు అతీతంగా తాము సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా అమలవుతున్న పథకాల జాబితాను వివరించారు. ఇదే సమయంలో క్రైస్తవ మిషినరీల ఏర్పాటు.. దేశవ్యాప్తంగా అవి చేస్తున్న కృషిని సీఎం రేవంత్ వివరించారు. ప్రభుత్వంతో పోటీ పడి మరీ మిషినరీలు సేవలు అందిస్తున్నాయని కొనియాడారు.
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…