Political News

జగన్ సంగతి ఒకే… ఆ 10 మంది ఏం చేస్తున్నట్టు?

వైసీపీ త‌ర‌ఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జ‌గ‌న్ ఒక‌రు. మిగిలిన 10 మంది ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో కీల‌క నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ ప్ర‌సాద్ రెడ్డి వంటి సీనియ‌ర్లు ఉన్నారు. అయితే.. ఈ ప‌ది మంది ఏం చేస్తున్నారు? పార్టీ లైన్‌లోనే న‌డుస్తున్నారా? లేక వేర్వేరు ప‌నులు పెట్టుకున్నారా? అనేది వైసీపీలో త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు ఎలా ఉన్నా.. పార్టీ ప‌రంగా వారు చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో చాలా మంది ఎమ్మెల్యేలు సొంత ప‌నులు చేసుకుంటున్నారు. ఎవ‌రికి వారు వారి వారి సొంత ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. ఈ ప‌రిణామం.. వైసీపీకి ఇబ్బందిగా మారింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపైనే జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు. జ‌న‌వ‌రి నుంచి జ‌నంలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రాఫ్‌పై వైసీపీ దృష్టి పెట్టింది. అధికారం లేక‌పోయినా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు ఎంత మంది ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న చ‌ర్చ చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలోనే క్రిస్ట‌మ‌స్ తర్వాత‌.. ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న‌తీరు.. ఎమ్మెల్యేల ప‌నితీరు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఆయ‌న దృష్టి పెట్ట‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. “ప‌ట్టు బిగిస్తున్నాం. ఎవ‌రినీ జ‌గ‌న్‌ వ‌దిలి పెట్ట‌రు. అంద‌రితోనూ చ‌ర్చించేందుకు టైంటేబుల్ రెడీ అవుతోంది.” అని వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు చెప్పారు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

మొత్తంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల ప‌నితీరును అంచ‌నా వేసేందుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌ధానంగా కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీ నేత‌ల‌తో క‌లివిడిగా ఉంటున్నార‌ని.. వ్యాపారాలు వ్య‌వ‌హారాల్లో త‌ల‌మున‌క‌ల‌య్యార‌న్న వాద‌న కూడా ఉంది. ఇలాంటి వారికి జ‌గ‌న్ క్లాస్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో త‌మ ప్ర‌మేయం లేకుండానే త‌మ‌పై వ్య‌తిరేక వార్త‌లు వ‌స్తున్నాయ‌ని చెబుతున్న వారి పై కూడా ఇటీవ‌ల కాలంలో వైసీపీ దృష్టి పెట్టింది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌నితీరును కూడా ప‌రిశీలించ‌నున్నారు. మొత్తంగా ఈ చ‌ర్చ‌లతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను దారిలోకి తీసుకువ‌చ్చే ప‌నిని ప్రారంభించారు.

This post was last modified on December 20, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

27 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago