Political News

వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్

వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో కిరాయి రౌడీ గ్యాంగులు ఉండవని హెచ్చరించారు. అలా చేస్తే కిరాయి గ్యాంగులు మెయింటైన్ చేసే వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని పరోక్షంగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం…కాంట్రాక్టర్లను జైల్లో పెడతాం అంటూ జగన్ చేసిన కామెంట్లకు పవన్ కౌంటర్ ఇచ్చారు.

ప్రభుత్వం తలచుకుంటే కరుడుగట్టిన నక్సలైట్ సంస్థలే కకావికలమయ్యాయని, ఈ రౌడీ మూకల ఆటకట్టించడం పెద్ద విషయం కాదని అన్నారు. ఇన్ని లక్షల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్ అధికారులు తలుచుకుంటే, కిరాయి రౌడీలపై ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు. ఆ పరిస్థితి తేవద్దని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైన విమర్శలు సహజమని, కానీ, గీత దాటి మాట్లాడతాం అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామని పంచ్ డైలాగ్ కొట్టారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ వారి బెదిరింపులకు భయపడలేదని గుర్తు చేశారు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. పవన్ ఎప్పుడూ పవన్ లాగే ఉంటాడని అన్నారు. వైసీపీ రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని పవన్ వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

1 hour ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

5 hours ago