బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు వెళ్లిన ఆయన స్వయంగా తన ఇంటి పత్రాలను వారికి ఇచ్చి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం.. 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రిగా పనిచేసి ఉండడం.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవసరం ఏముందన్న సందేహం వస్తుంది.
అయితే.. ఈ అప్పు.. తన కోసం కాదు. తన నియోజకవర్గంలోని పేద కుటుంబానికి చెందిన యువతి ఉన్నత చదువు కోసం.. హరీష్రావు అప్పు చేసి మరీ నిధులు సమకూర్చారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రం కుటుంబం పేదరికంలో ఉంది. అయితే.. ఆయన కుమార్తె మమత నీట్లో సీటు దక్కించుకుంది. దీంతో గతంలోనే హరీష్రావు ఆ కుటుంబాన్ని ఆదుకుని.. ఎంబీబీఎస్ కు అయ్యే సొమ్మును భరించారు. ఇప్పుడు మమత.. పీజీలోనూ సీటు దక్కించుకుంది.
కానీ, ఏటా 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఈ విషయాన్ని రామచంద్రం.. ఇటీవల హరీష్ రావు దృష్టికి తెచ్చారు. తమకు ఇల్లు, పొలం వంటివి ఏమీ లేవని.. ఉంటే విద్యారుణం తీసుకునే వారమని విలపించారు. ఈ కష్టం చూసి కరిగిపోయిన హరీష్రావు.. నేనున్నానంటూ.. పెద్ద మనసు చాటుకున్నారు.
శుక్రవారం ఉదయం బ్యాంకు కు వెళ్లి.. తన ఇంటి పత్రాలను తాకట్టుగా పెట్టి.. విద్యా రుణం తీసుకున్నారు. అనంతరం.. తన ఇంటికి చేరుకుని.. మమతను శాలువాతో సత్కరించి.. మూడేళ్లకు సరిపోయేలా 20 లక్షల రూపాయల సొమ్మును ఆమెకు అందించారు. దీంతో మమత ఆనందబాష్పాలు రాల్చింది. హరీష్ రావు చేసిన సాయాన్ని జన్మ జన్మలకూ మరిచిపోలేనని పేర్కొంది.
కాగా.. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. జగ్గారెడ్డి కూడా.. ఓ పేద కుటుంబానికి చదువు కోసం 10 లక్షల రూపాయలను సాయం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి, బట్టలు పెట్టి మరీ నగదు నోట్ల కట్టలను వారికి ఇచ్చి.. ప్రోత్సహించారు. ఇప్పుడు హరీష్రావు కూడా ఇదే పనిచేశారు. కాగా.. ఇరువురి సాయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…