బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు వెళ్లిన ఆయన స్వయంగా తన ఇంటి పత్రాలను వారికి ఇచ్చి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం.. 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రిగా పనిచేసి ఉండడం.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవసరం ఏముందన్న సందేహం వస్తుంది.
అయితే.. ఈ అప్పు.. తన కోసం కాదు. తన నియోజకవర్గంలోని పేద కుటుంబానికి చెందిన యువతి ఉన్నత చదువు కోసం.. హరీష్రావు అప్పు చేసి మరీ నిధులు సమకూర్చారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రం కుటుంబం పేదరికంలో ఉంది. అయితే.. ఆయన కుమార్తె మమత నీట్లో సీటు దక్కించుకుంది. దీంతో గతంలోనే హరీష్రావు ఆ కుటుంబాన్ని ఆదుకుని.. ఎంబీబీఎస్ కు అయ్యే సొమ్మును భరించారు. ఇప్పుడు మమత.. పీజీలోనూ సీటు దక్కించుకుంది.
కానీ, ఏటా 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఈ విషయాన్ని రామచంద్రం.. ఇటీవల హరీష్ రావు దృష్టికి తెచ్చారు. తమకు ఇల్లు, పొలం వంటివి ఏమీ లేవని.. ఉంటే విద్యారుణం తీసుకునే వారమని విలపించారు. ఈ కష్టం చూసి కరిగిపోయిన హరీష్రావు.. నేనున్నానంటూ.. పెద్ద మనసు చాటుకున్నారు.
శుక్రవారం ఉదయం బ్యాంకు కు వెళ్లి.. తన ఇంటి పత్రాలను తాకట్టుగా పెట్టి.. విద్యా రుణం తీసుకున్నారు. అనంతరం.. తన ఇంటికి చేరుకుని.. మమతను శాలువాతో సత్కరించి.. మూడేళ్లకు సరిపోయేలా 20 లక్షల రూపాయల సొమ్మును ఆమెకు అందించారు. దీంతో మమత ఆనందబాష్పాలు రాల్చింది. హరీష్ రావు చేసిన సాయాన్ని జన్మ జన్మలకూ మరిచిపోలేనని పేర్కొంది.
కాగా.. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. జగ్గారెడ్డి కూడా.. ఓ పేద కుటుంబానికి చదువు కోసం 10 లక్షల రూపాయలను సాయం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి, బట్టలు పెట్టి మరీ నగదు నోట్ల కట్టలను వారికి ఇచ్చి.. ప్రోత్సహించారు. ఇప్పుడు హరీష్రావు కూడా ఇదే పనిచేశారు. కాగా.. ఇరువురి సాయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 19, 2025 5:07 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…