బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు వెళ్లిన ఆయన స్వయంగా తన ఇంటి పత్రాలను వారికి ఇచ్చి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం.. 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రిగా పనిచేసి ఉండడం.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవసరం ఏముందన్న సందేహం వస్తుంది.
అయితే.. ఈ అప్పు.. తన కోసం కాదు. తన నియోజకవర్గంలోని పేద కుటుంబానికి చెందిన యువతి ఉన్నత చదువు కోసం.. హరీష్రావు అప్పు చేసి మరీ నిధులు సమకూర్చారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రం కుటుంబం పేదరికంలో ఉంది. అయితే.. ఆయన కుమార్తె మమత నీట్లో సీటు దక్కించుకుంది. దీంతో గతంలోనే హరీష్రావు ఆ కుటుంబాన్ని ఆదుకుని.. ఎంబీబీఎస్ కు అయ్యే సొమ్మును భరించారు. ఇప్పుడు మమత.. పీజీలోనూ సీటు దక్కించుకుంది.
కానీ, ఏటా 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఈ విషయాన్ని రామచంద్రం.. ఇటీవల హరీష్ రావు దృష్టికి తెచ్చారు. తమకు ఇల్లు, పొలం వంటివి ఏమీ లేవని.. ఉంటే విద్యారుణం తీసుకునే వారమని విలపించారు. ఈ కష్టం చూసి కరిగిపోయిన హరీష్రావు.. నేనున్నానంటూ.. పెద్ద మనసు చాటుకున్నారు.
శుక్రవారం ఉదయం బ్యాంకు కు వెళ్లి.. తన ఇంటి పత్రాలను తాకట్టుగా పెట్టి.. విద్యా రుణం తీసుకున్నారు. అనంతరం.. తన ఇంటికి చేరుకుని.. మమతను శాలువాతో సత్కరించి.. మూడేళ్లకు సరిపోయేలా 20 లక్షల రూపాయల సొమ్మును ఆమెకు అందించారు. దీంతో మమత ఆనందబాష్పాలు రాల్చింది. హరీష్ రావు చేసిన సాయాన్ని జన్మ జన్మలకూ మరిచిపోలేనని పేర్కొంది.
కాగా.. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. జగ్గారెడ్డి కూడా.. ఓ పేద కుటుంబానికి చదువు కోసం 10 లక్షల రూపాయలను సాయం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి, బట్టలు పెట్టి మరీ నగదు నోట్ల కట్టలను వారికి ఇచ్చి.. ప్రోత్సహించారు. ఇప్పుడు హరీష్రావు కూడా ఇదే పనిచేశారు. కాగా.. ఇరువురి సాయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 19, 2025 5:07 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…