Political News

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వ‌చ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు అలెర్టుగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. శుక్ర‌వారం ఉద‌య‌మే పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. తాజాగా తెలంగాణలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ సాధించిన విజ‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో అదే ఫ‌లితం ఏపీలోనూ రావాల‌ని సూచించారు. టిడిపి శ్రేణులు… నాయకులు ప్రజలకు చేరువ కావాలన్నారు.

పార్టీ కార్యక్రమాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు. వాస్త‌వానికి ఈ విషయాన్ని ఆది నుంచి సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు, అదే విధంగా ప్రజల మధ్యకు వెళ్లాలని కూడా ఆయన తాజాగా మ‌రోసారి సూచిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న క్రమంలో పార్టీ నాయకులు అందరూ అలెర్ట్ గా ఉండాలని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

పక్క‌నే ఉన్న తెలంగాణ‌లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్ల‌లేద‌న్న విష‌యం స్ప‌ష్టం అయింది. అదే ఫ‌లితం ఏపీలోనూ క‌నిపించాలి.. అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలకు సిద్ధపడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి సామాజిక భ‌ద్ర‌తా పింఛన్ల పంపిణీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు అంద‌రూ హాజరు కావాల‌ని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని కూడా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు త‌మ త‌మ కార్య‌క్ర‌మాల్లో మార్పులు కూడా చేసుకోవాలని సీఎం చంద్ర బాబు సూచించారు. అంద‌రూ క‌లిస్తే.. తిరుగులేని విధంగా కూట‌మి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని.. గ్రామీణ ప్రాంతాల్లో చేప‌డుతున్న అభివృద్ధిని కూడా వివ‌రించాల‌ని తెలిపారు. త‌మకు సంబంధం లేద‌ని ఎవ‌రూ భావించ‌రాద‌ని కూడా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

This post was last modified on December 19, 2025 10:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

1 hour ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago