Political News

ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు గురువారం తిరుపతిలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు.

నందమూరి కుటుంబం తరపున రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఎన్టీఆర్ రాజు నందమూరి వీరాభిమానిగా ఎనలేని సేవలు చేశారని, రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా భక్తులకు అమూల్య సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు, ఆయన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని జీవితాంతం ఎన్టీఆర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. బుధవారం తిరుపతిలో కన్నుమూశారు. ఈ మరణవార్తతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన ఎన్టీఆర్ రాజు, తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలు అందించారు. ఎన్టీఆర్ స్వయంగా ఉన్నత పదవులు, ఎమ్మెల్యే అవకాశాలు ఆఫర్ చేసినప్పటికీ, అభిమానిగా ఉండటమే చాలునని తిరస్కరించారు. పదవులకన్నా ఆదర్శాలు ముఖ్యమని చాటిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

This post was last modified on December 19, 2025 10:38 am

Share

Recent Posts

కూలిపోయిన హాస్టల్… అగ్రిమెంట్‌లో మాత్రం ‘మాకు బాధ్యత లేదు’!

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…

2 hours ago

అప్పుడు బన్నీతో… ఇప్పుడు బాలయ్యతో?

తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…

2 hours ago

ది ప్యారడైజ్.. నాన్ స్టాప్ మోడ్

చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…

3 hours ago

ఫేక్ కలెక్షన్లపై వంగ బ్రదర్ పంచ్‌లు

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. ఈ రోజుల్లో ఒరిజినల్ కలెక్షన్లను పెంచి పోస్టర్లు వేయడం మామూలైపోయింది.…

3 hours ago

అయోమయంలో ఇస్రో అధికారులు?

దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తు ప్రమాదంలో పడిందా అంటే అవుననే చెప్పాలి. అత్యంత…

4 hours ago

కమ్మ, రెడ్లే సీఎంలు కావాలా?: సాయిరెడ్డి

రాజకీయాలకు గుడ్ బై చెప్పానని…వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన రాజ్య సభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి త్వరలోని కొత్త పార్టీ పెట్టబోతున్న…

4 hours ago