Political News

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, యుద్ధం జరగకపోయినా సరే, అక్కడ మన ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది.

అప్పట్లో సమస్య ఒక కొత్త దేశం పుట్టుకకు సంబంధించింది అయితే, ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ మార్పు అని కమిటీ పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావం పెరగడం వల్ల అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలు అక్కడ తమ పట్టు పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా చైనా తీరు ఆందోళన కలిగిస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలు, పోర్టుల పేరుతో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్ దగ్గర కేవలం రెండు సబ్ మెరైన్లు ఉంటే, చైనా ఏకంగా ఎనిమిది సబ్ మెరైన్లు పట్టేంత పెద్ద బేస్‌ను అక్కడ నిర్మిస్తోంది. దీన్ని బట్టే వారి ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జమాత్-ఇ-ఇస్లామీ లాంటి సంస్థలతో కూడా చైనా సన్నిహితంగా ఉంటోంది.

ప్రస్తుతం అక్కడ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌పై నిషేధం విధించి, గతంలో బ్యాన్ అయిన జమాత్ ఇ ఇస్లామీకి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ మధ్య అక్కడ భారత్ వ్యతిరేకత బాగా పెరిగింది. మన ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ అక్కడ కొంతమంది నాయకులు బాహాటంగానే బెదిరింపులకు దిగుతున్నారు.

వేరే దేశాల సైన్యం అక్కడ తిష్ట వేయకుండా భారత్ గట్టి నిఘా పెట్టాలని కమిటీ సూచించింది. కేవలం యుద్ధం వల్ల కాదు, మన నిర్లక్ష్యం వల్ల బంగ్లాదేశ్ మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అభివృద్ధి, పోర్టుల విషయంలో వారికి మంచి ఆఫర్లు ఇచ్చి మన సంబంధాలను కాపాడుకోవాలని నివేదికలో స్పష్టం చేశారు.

This post was last modified on December 18, 2025 10:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

3 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

3 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

4 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

4 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

7 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

8 hours ago