Political News

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, యుద్ధం జరగకపోయినా సరే, అక్కడ మన ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది.

అప్పట్లో సమస్య ఒక కొత్త దేశం పుట్టుకకు సంబంధించింది అయితే, ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ మార్పు అని కమిటీ పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావం పెరగడం వల్ల అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలు అక్కడ తమ పట్టు పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా చైనా తీరు ఆందోళన కలిగిస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలు, పోర్టుల పేరుతో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్ దగ్గర కేవలం రెండు సబ్ మెరైన్లు ఉంటే, చైనా ఏకంగా ఎనిమిది సబ్ మెరైన్లు పట్టేంత పెద్ద బేస్‌ను అక్కడ నిర్మిస్తోంది. దీన్ని బట్టే వారి ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జమాత్-ఇ-ఇస్లామీ లాంటి సంస్థలతో కూడా చైనా సన్నిహితంగా ఉంటోంది.

ప్రస్తుతం అక్కడ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌పై నిషేధం విధించి, గతంలో బ్యాన్ అయిన జమాత్ ఇ ఇస్లామీకి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ మధ్య అక్కడ భారత్ వ్యతిరేకత బాగా పెరిగింది. మన ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ అక్కడ కొంతమంది నాయకులు బాహాటంగానే బెదిరింపులకు దిగుతున్నారు.

వేరే దేశాల సైన్యం అక్కడ తిష్ట వేయకుండా భారత్ గట్టి నిఘా పెట్టాలని కమిటీ సూచించింది. కేవలం యుద్ధం వల్ల కాదు, మన నిర్లక్ష్యం వల్ల బంగ్లాదేశ్ మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అభివృద్ధి, పోర్టుల విషయంలో వారికి మంచి ఆఫర్లు ఇచ్చి మన సంబంధాలను కాపాడుకోవాలని నివేదికలో స్పష్టం చేశారు.

This post was last modified on December 18, 2025 10:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

54 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

7 hours ago