కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే ట్యాగ్ కూడా అంటగట్టారు. ఎక్కడ నోరు విప్పినా బూతులు మాట్లాడతారన్న ప్రచారం బలంగా సాగింది. ముఖ్యంగా జగన్కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరు ఉంది. అలాంటి నాయకుడు గత ఎన్నికల్లో తొలిసారి పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా, నాని మాత్రం ఇప్పటివరకు ఓడిందే లేదన్న భావనలోనే ఉండేవారు.
కానీ గత ఎన్నికల్లో కూటమి హవాతో పాటు, కొడాలిపై కమ్మ సామాజిక వర్గం ఆగ్రహం కూడా కలిసి రావడంతో ఆయన పరాజయం తప్పలేదు. మరి ఇప్పటికైనా ఆయనలో మార్పు కనిపిస్తోందా అంటే, వ్యక్తిగతంగా పెద్దగా మార్పు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే నియోజకవర్గంలో ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రస్తుతం గత 18 నెలలుగా ఆయన యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం, గుండె ఆపరేషన్ కారణంగా కొడాలి ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ఇచ్చారు.
ఇంకా కనీసం ఆరు నెలల వరకు కొడాలి యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధంగా లేరని సమాచారం. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో కొడాలిని రీప్లేస్ చేస్తారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ రంగం సిద్ధం చేస్తున్నారని కూడా చెబుతున్నారు. బలమైన ఆర్థిక మద్దతుతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్న సమాచారం ఉంది. ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వ్యక్తితో చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవిని అవమానించారన్న చర్చ వచ్చినప్పుడు, ఆ నిర్మాత బహిరంగంగా స్పందించి వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఈయన గోదావరి జిల్లాలకు చెందిన నిర్మాతగా చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉంటారన్న పేరు కూడా ఉంది. ఆయనను చూస్తే థ్రిల్, దిల్ రెండూ కనిపిస్తాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈయనతో జగన్ చర్చించినట్టు సమాచారం.
అదే సమయంలో ఈయన కాకపోతే, గతంలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్న మరో పారిశ్రామికవేత్తతో కూడా జగన్ చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఖాయమయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అయితే కొడాలి నానికి పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 18, 2025 2:02 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…