Political News

రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!

రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ, ‘వైనాట్ 175’ మంత్రం పఠించినప్పటికీ కూడా ఆయన పుంజుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా కీలక సామాజిక వర్గాల మద్దతు చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వర్గాల మద్దతు లేకుండా పార్టీలు విజయం సాధించడం కష్టంగా మారిందనే అభిప్రాయం బలంగా ఉంది.

ఈ నేపథ్యంలో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో సంప్రదాయంగా రెడ్లకు కేటాయించే నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వడం, సరైన రాజకీయ సమీకరణలు లేకుండా ఐప్యాక్ సూచనల మేరకు మార్పులు చేయడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా రెడ్లకు కేటాయించాల్సిన స్థానాలు కూడా బీసీలకు వెళ్లాయి. దీంతో రెడ్డి సామాజిక వర్గం పార్టీకి పూర్తిగా దూరమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవడం వైసీపీకి మరింత దెబ్బగా మారింది. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సంక్షేమ పథకాలు అమలు చేశామని, తమకు తిరుగు లేదని చెప్పుకున్న పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

ఇక వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ప్రస్తుతం వైసీపీకి స్పష్టమైన దిశ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలనే ఆధారంగా చేసుకుని ప్రజల మద్దతు పొందాలని పార్టీ భావించినప్పటికీ, ఇప్పుడు అదే తరహా పథకాలను కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది.

ఈ మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో జగన్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావిస్తుండటంతో, వైసీపీ కొత్తగా రాజకీయంగా బలమైన మార్పులు తీసుకురాకపోతే మరింత నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించి, ఆ వర్గాన్ని మళ్లీ దగ్గర చేసుకోలేకపోతే వైసీపీ భవిష్యత్తు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.

This post was last modified on December 18, 2025 1:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

55 minutes ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

4 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

4 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago