Political News

రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!

రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ, ‘వైనాట్ 175’ మంత్రం పఠించినప్పటికీ కూడా ఆయన పుంజుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా కీలక సామాజిక వర్గాల మద్దతు చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వర్గాల మద్దతు లేకుండా పార్టీలు విజయం సాధించడం కష్టంగా మారిందనే అభిప్రాయం బలంగా ఉంది.

ఈ నేపథ్యంలో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో సంప్రదాయంగా రెడ్లకు కేటాయించే నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వడం, సరైన రాజకీయ సమీకరణలు లేకుండా ఐప్యాక్ సూచనల మేరకు మార్పులు చేయడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా రెడ్లకు కేటాయించాల్సిన స్థానాలు కూడా బీసీలకు వెళ్లాయి. దీంతో రెడ్డి సామాజిక వర్గం పార్టీకి పూర్తిగా దూరమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవడం వైసీపీకి మరింత దెబ్బగా మారింది. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సంక్షేమ పథకాలు అమలు చేశామని, తమకు తిరుగు లేదని చెప్పుకున్న పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

ఇక వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ప్రస్తుతం వైసీపీకి స్పష్టమైన దిశ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలనే ఆధారంగా చేసుకుని ప్రజల మద్దతు పొందాలని పార్టీ భావించినప్పటికీ, ఇప్పుడు అదే తరహా పథకాలను కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది.

ఈ మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో జగన్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావిస్తుండటంతో, వైసీపీ కొత్తగా రాజకీయంగా బలమైన మార్పులు తీసుకురాకపోతే మరింత నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించి, ఆ వర్గాన్ని మళ్లీ దగ్గర చేసుకోలేకపోతే వైసీపీ భవిష్యత్తు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.

This post was last modified on December 18, 2025 1:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

14 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

22 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

1 hour ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago