Political News

జగన్ – కేసీఆర్.. జనాల్లోకి వచ్చినా..?

వైసీపీ అధినేత జగన్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే త్వరలోనే ఇద్దరూ ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరి గ్రాఫ్ ఎలా ఉన్నా, రాజకీయాల కోణంలో చూస్తే వారి పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే అయినా, ప్రస్తుతం అంతగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆశతోనే ఇద్దరూ ముందుకు వస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వారు జనాల్లోకి వస్తే ఎంత మేరకు సింపతి గెయిన్ చేస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కావొచ్చు, ప్రత్యర్థులు చెబుతున్నట్లుగా అక్రమాలు కావొచ్చు, ఇవన్నీ ఇద్దరినీ వెంటాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ గ్రాఫ్‌పై చర్చ కొనసాగుతోంది.

జగన్ విషయంలో ఈ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది. మూడు పార్టీలు కలసి ముందుకు వెళ్లడం, జగన్ ఒంటరి పోరులో ఉండడం వల్ల ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మూడు పార్టీలూ కలిసి ఎన్నికలకు వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో కూటమి అవసరమన్న వాదన కూడా చర్చకు వచ్చింది. తొలినాళ్లలో దీనిపై ఆసక్తి చూపినప్పటికీ, ఇప్పుడు ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని సమాచారం. “కూటమి మనకెందుకు.. మనం ఒంటరిగానే వెళ్తాం” అని జగన్ అత్యంత సన్నిహితులతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నారని సమాచారం.

కానీ జగన్ చెబుతున్నట్లుగా పరిస్థితి లేదన్న వాదన మరోవైపు వైసీపీలోనే వినిపించడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో, జగన్‌పై మరియు వైసీపీ నేతలపై రాజకీయ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిని ఎంతవరకు తట్టుకుని నిలబడగలరో చూడాలి.

ఇక కేసీఆర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేమైనా, జగన్ మరియు కేసీఆర్ ఇద్దరి రాజకీయ ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయో చూడాల్సి ఉంది.

This post was last modified on January 6, 2026 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…

29 minutes ago

రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌సు చాటుకున్నారు. రైతుల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను…

37 minutes ago

బొమ్మా బొరుసా… కోర్టు చేతిలో జీవోల బంతి

ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…

49 minutes ago

క‌ష్టాల్లో కానిస్టేబుల్ త‌ల్లి… వెంటనే స్పందించిన లోకేష్‌!

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి త‌న మ‌న‌సు చాటుకున్నారు. లోక‌ల్‌గానే కాదు... విదేశాల్లో కూడా ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నార‌ని…

2 hours ago

అమిత్ షాతో బాబు భేటీ, చాలా కీలకం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు వివ‌రించారు.…

2 hours ago

ఏపీలో కొత్తగా 11,753 ఉద్యోగ అవకాశాలు..

ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం…

2 hours ago