Political News

జగన్ – కేసీఆర్.. జనాల్లోకి వచ్చినా..?

వైసీపీ అధినేత జగన్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే త్వరలోనే ఇద్దరూ ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరి గ్రాఫ్ ఎలా ఉన్నా, రాజకీయాల కోణంలో చూస్తే వారి పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే అయినా, ప్రస్తుతం అంతగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆశతోనే ఇద్దరూ ముందుకు వస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వారు జనాల్లోకి వస్తే ఎంత మేరకు సింపతి గెయిన్ చేస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కావొచ్చు, ప్రత్యర్థులు చెబుతున్నట్లుగా అక్రమాలు కావొచ్చు, ఇవన్నీ ఇద్దరినీ వెంటాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ గ్రాఫ్‌పై చర్చ కొనసాగుతోంది.

జగన్ విషయంలో ఈ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది. మూడు పార్టీలు కలసి ముందుకు వెళ్లడం, జగన్ ఒంటరి పోరులో ఉండడం వల్ల ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మూడు పార్టీలూ కలిసి ఎన్నికలకు వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో కూటమి అవసరమన్న వాదన కూడా చర్చకు వచ్చింది. తొలినాళ్లలో దీనిపై ఆసక్తి చూపినప్పటికీ, ఇప్పుడు ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని సమాచారం. “కూటమి మనకెందుకు.. మనం ఒంటరిగానే వెళ్తాం” అని జగన్ అత్యంత సన్నిహితులతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నారని సమాచారం.

కానీ జగన్ చెబుతున్నట్లుగా పరిస్థితి లేదన్న వాదన మరోవైపు వైసీపీలోనే వినిపించడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో, జగన్‌పై మరియు వైసీపీ నేతలపై రాజకీయ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిని ఎంతవరకు తట్టుకుని నిలబడగలరో చూడాలి.

ఇక కేసీఆర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేమైనా, జగన్ మరియు కేసీఆర్ ఇద్దరి రాజకీయ ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయో చూడాల్సి ఉంది.

This post was last modified on January 6, 2026 10:20 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago