Political News

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్ పరిధిలో ఈ సేవలను అమలు చేస్తోంది. రైతు బజార్‌లో ఉన్న ధరలకే తాజా కూరగాయలు, పండ్లను వినియోగదారుల ఇంటి వద్దకే 30 నిమిషాల నుంచి గంటలోపు డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ సేవల కోసం https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.

మాచింట్ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ డిజిటల్ వేదిక ద్వారా వినియోగదారులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి రోజు రైతు బజారులో అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, వాటి ధరలు, స్టాక్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తారు. అదనపు డెలివరీ ఛార్జీలు లేకుండా, రైతు బజార్‌లో లభించే అసలు ధరలకే ఉత్పత్తులు అందించడం ఈ విధానం ప్రత్యేకత.

ప్రస్తుతం ఎంవీపీ కాలనీ రైతు బజార్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసించే వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన వంటి అంశాలను పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు పూర్తిచేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెట్ ఏర్పడటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. మధ్యవర్తులు లేకపోవడంతో వినియోగదారులకు తక్కువ ధరలు, రైతులకు నేర లాభం చేకూరనుంది. పైలట్ దశ విజయవంతమైతే ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతు బజార్లకు విస్తరించడంతో పాటు త్వరలో మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

This post was last modified on December 18, 2025 12:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: AP Farmers

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

28 minutes ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

37 minutes ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

52 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

1 hour ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

1 hour ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

1 hour ago