Political News

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్ పరిధిలో ఈ సేవలను అమలు చేస్తోంది. రైతు బజార్‌లో ఉన్న ధరలకే తాజా కూరగాయలు, పండ్లను వినియోగదారుల ఇంటి వద్దకే 30 నిమిషాల నుంచి గంటలోపు డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ సేవల కోసం https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.

మాచింట్ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ డిజిటల్ వేదిక ద్వారా వినియోగదారులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి రోజు రైతు బజారులో అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, వాటి ధరలు, స్టాక్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తారు. అదనపు డెలివరీ ఛార్జీలు లేకుండా, రైతు బజార్‌లో లభించే అసలు ధరలకే ఉత్పత్తులు అందించడం ఈ విధానం ప్రత్యేకత.

ప్రస్తుతం ఎంవీపీ కాలనీ రైతు బజార్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసించే వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన వంటి అంశాలను పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు పూర్తిచేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెట్ ఏర్పడటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. మధ్యవర్తులు లేకపోవడంతో వినియోగదారులకు తక్కువ ధరలు, రైతులకు నేర లాభం చేకూరనుంది. పైలట్ దశ విజయవంతమైతే ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతు బజార్లకు విస్తరించడంతో పాటు త్వరలో మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

This post was last modified on December 18, 2025 12:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: AP Farmers

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

1 hour ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

3 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

5 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

5 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

6 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

6 hours ago