చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా అడిగితే టక్కున… వైయస్ జగన్ అని సమాధానం ఇస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం అంతలా పెరిగిపోయింది. జగన్ విషెస్ చెప్పలేదు సరే… షర్మిలకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
జగనన్నను వదిలి బాణాన్ని అంటూ ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఆ తర్వాతి పరిణామాలతో వైసీపీకి దూరమయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కొంతకాలం నడిపించారు. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. జగన్ ఓటమికి ఆమె కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం కూడా నడుస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. షర్మిల పలు సార్లు తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, కూటమి గెలిచిన తొలి రోజుల నుంచే కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల తక్కువ మోతాదులో రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి షర్మిల అనుకూలంగా ఉన్నారని కొంతకాలం వైసీపీ కూడా విమర్శలు చేసింది. అదేమీ పట్టించుకోకుండా గత వైసీపీ విధానాలను మాత్రం షర్మిల ఎప్పుడూ ఎండగడుతూనే ఉన్నారు. అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు సమాచారం. ఈ మధ్య కూటమి ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శల ఘాటు కొద్దిగా పెంచారు.
ఈ క్రమంలో ఆమెకు ముగ్గురు నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆమెకు విషెస్ చెప్పగా… థ్యాంక్యూ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్న జగన్ మాత్రం ఆమెకు విషెస్ చెప్పకపోవడం అభిమానుల్లో కూడా చర్చకు దారి తీసింది.
This post was last modified on December 17, 2025 8:23 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…