Political News

క‌విత పొలిటికల్ గ్రాఫ్ పై కేసీఆర్ నిఘా?

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తాజాగా రెండోసారి తన కుమార్తె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్‌ష‌న్‌కు గురైన కవిత పై స్పందించారు. ఇటీవల కవితపై కూకట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కవిత మీడియా ముందుకు వ‌చ్చి పదే పదే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడంతో పాటు తనను కెలకద్దంటూ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలు బయటపెడతానని తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు విచారణ చేయిస్తానని కూడా అన్నారు.

తాజాగా ఈ విషయాలుపై ప‌లువురు నాయకులు కేసీఆర్ కు వివరించారు. ఆదివారం సాయంత్రం జరిగిన అంతర్గత సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా లైట్ గానే స్పందించినట్లు తెలిసింది. ఎందుకు ఆవిడ గురించి అనవసరంగా మాట్లాడతారని మాధవరం కృష్ణారావును ఉద్దేశించే ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సాధారణ‌మేన‌ని, ఇప్పటివరకు తాను అనేకమంది నాయకులను చూశానని, ఎంతోమంది నాయకులు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి వారిని మనం హైలెట్ చేసి అనవసరంగా వాళ్ళ గ్రాఫ్ పెంచడం ఎందుకు అని కూడా కేసీఆర్ ప్రశ్నించినట్టు అత్యంత విశ్వసనీయ‌ వర్గాల ద్వారా తెలిసింది. అసలు అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మనం ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని ఆయన వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి, కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే కవిత విషయాన్ని ప్రస్తావించిన కెసిఆర్ అసలు ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడవద్దని చెప్పినట్టు కూడా తెలిసింది,

ఏదేదో అనుకుంటే వాటికి మనం బాధ్యులం కాదని, ఏది ఉన్నా ప్రజలు తెలుస్తారని, అసలు ప్రజల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డంతోనే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు సమాచారం. మొత్తంగా గతంలో కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ఇదే వ్యాఖ్యలు చేశారు. కవితను అనవసరంగా పట్టించుకుంటున్నారని, దానికన్నా ప్రజల మధ్య ఉంటే మనకు మేలు జరుగుతుందని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేసి కవిత గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. మరి దీంతో ఇక కవిత గురించి నాయకులు మాట్లాడతారా లేదా అనేది చూడాలి.

This post was last modified on December 16, 2025 8:49 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

54 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago