బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తాజాగా రెండోసారి తన కుమార్తె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత పై స్పందించారు. ఇటీవల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కవిత మీడియా ముందుకు వచ్చి పదే పదే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడంతో పాటు తనను కెలకద్దంటూ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలు బయటపెడతానని తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు విచారణ చేయిస్తానని కూడా అన్నారు.
తాజాగా ఈ విషయాలుపై పలువురు నాయకులు కేసీఆర్ కు వివరించారు. ఆదివారం సాయంత్రం జరిగిన అంతర్గత సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా లైట్ గానే స్పందించినట్లు తెలిసింది. ఎందుకు ఆవిడ గురించి అనవసరంగా మాట్లాడతారని మాధవరం కృష్ణారావును ఉద్దేశించే ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సాధారణమేనని, ఇప్పటివరకు తాను అనేకమంది నాయకులను చూశానని, ఎంతోమంది నాయకులు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వారిని మనం హైలెట్ చేసి అనవసరంగా వాళ్ళ గ్రాఫ్ పెంచడం ఎందుకు అని కూడా కేసీఆర్ ప్రశ్నించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసలు అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మనం ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని ఆయన వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి, కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే కవిత విషయాన్ని ప్రస్తావించిన కెసిఆర్ అసలు ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడవద్దని చెప్పినట్టు కూడా తెలిసింది,
ఏదేదో అనుకుంటే వాటికి మనం బాధ్యులం కాదని, ఏది ఉన్నా ప్రజలు తెలుస్తారని, అసలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతోనే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు సమాచారం. మొత్తంగా గతంలో కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ఇదే వ్యాఖ్యలు చేశారు. కవితను అనవసరంగా పట్టించుకుంటున్నారని, దానికన్నా ప్రజల మధ్య ఉంటే మనకు మేలు జరుగుతుందని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేసి కవిత గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. మరి దీంతో ఇక కవిత గురించి నాయకులు మాట్లాడతారా లేదా అనేది చూడాలి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…