Political News

బాబు స్పెషల్: శాంతి వనంలోనూ పెట్టుబడుల ధ్యానం!

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. విదేశాలకు కూడా వెళ్లి పెట్టుబడి సంస్థలను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించారు.

ఇది పూర్తిగా యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఇక్కడ కూడా పెట్టుబడులపైనే ఆలోచన చేశారు. ఏపీలో కూడా ఇలాంటి శాంతి వనాన్ని ఏర్పాటు చేసే అంశంపై కన్హాను నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి. పటేల్ దాజీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని అమరావతి, విశాఖలో ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.

ముఖ్యంగా మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హార్ట్ ఫుల్ నెస్ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ఇలాంటి కేంద్రాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్నాళ్ల కిందట విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం విజయవంతమైన తీరు, దీనికి ప్రపంచ స్థాయిలో వచ్చిన రికార్డులు, అవార్డులను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ శాంతి వనం తరహా ప్రాజెక్టు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖలో యోగా కేంద్రం, అమరావతిలో హార్ట్ ఫుల్ నెస్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎక్కడ ఉన్నా పెట్టుబడులపైనే ధ్యానం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

This post was last modified on December 15, 2025 4:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వనాథ్ సన్స్ అంత రిస్కు చేస్తారా

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…

16 minutes ago

జగపతి… అది వదులుకొని ఇది పట్టుకున్నారా

హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…

2 hours ago

వీర‌భ‌ద్రుడికి లైన్ క్లియ‌ర్… మ‌రి జ‌న‌నాయ‌కుడు?

త‌మిళ రాజ‌కీయాల్లో గ‌త కొన్ని రోజులుగా న‌డుస్తున్న రాజ‌కీయ సందిగ్ధ‌త‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును టీవీకే…

2 hours ago

మోదీ బంగారాన్ని ఎందుకు కొనొద్దంటున్నారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……

2 hours ago

మోదీకి మరిచిపోలేని ఆతిథ్యమిచ్చిన చంద్రబాబు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…

2 hours ago

చిరంజీవి అలాంటి పొరపాటు చేయరు

మలయాళం బ్లాక్ బస్టర్ తుడరమ్ దర్శకుడు తరుణ్ మూర్తి ఇటీవలే చిరంజీవిని కలుసుకోవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. తుడరమ్ రీమేక్…

2 hours ago