ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. విదేశాలకు కూడా వెళ్లి పెట్టుబడి సంస్థలను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించారు.
ఇది పూర్తిగా యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఇక్కడ కూడా పెట్టుబడులపైనే ఆలోచన చేశారు. ఏపీలో కూడా ఇలాంటి శాంతి వనాన్ని ఏర్పాటు చేసే అంశంపై కన్హాను నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి. పటేల్ దాజీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని అమరావతి, విశాఖలో ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
ముఖ్యంగా మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హార్ట్ ఫుల్ నెస్ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ఇలాంటి కేంద్రాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్నాళ్ల కిందట విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం విజయవంతమైన తీరు, దీనికి ప్రపంచ స్థాయిలో వచ్చిన రికార్డులు, అవార్డులను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ శాంతి వనం తరహా ప్రాజెక్టు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖలో యోగా కేంద్రం, అమరావతిలో హార్ట్ ఫుల్ నెస్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎక్కడ ఉన్నా పెట్టుబడులపైనే ధ్యానం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం.
This post was last modified on December 15, 2025 4:44 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…