Political News

సీఎం వచ్చినా తగ్గేదేలే అంటున్న ఉద్యమకారులు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి నిరాకరించారని, తెలంగాణ గడ్డపై ముందుగా అందె శ్రీ, గద్దర్ వంటి స్థానిక కళాకారులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కాలని వారు వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

దీంతో, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే, సీఎం వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని, తగ్గేదే లే అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్విరాజ్‌ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను ఎన్ని రోజులు కాపలా పెడతారో చూస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీలో తెలంగాణ కళాకారులకు గుర్తింపు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దివంగత సీఎం రోశయ్య విగ్రహం పెట్టారని, కానీ, చెన్నారెడ్డి, అంజయ్య వంటి తెలంగాణకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరుల ఆత్మ వంచన జరుగుతోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కవులను బొంద పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కవులు, సాహిత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా హాజరు కాబోతున్నారు.

This post was last modified on December 15, 2025 4:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

13 minutes ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

2 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

2 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

5 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

6 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

7 hours ago