తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీనివ్వలేకపోయింది. 312 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన 93 మంది అభ్యర్థులు గెలిచారు. మరో 250 స్థానాల్లో ఇతరులు, ఇండిపెండెంట్లు, రెబల్స్ విజయం సాధించారు.
రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో ఓటు వేసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండో విడత పోలింగ్ లో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 29917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మూడో దశ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. మూడో దశలో182 మండలాల్లోని 4159 గ్రామాలు, .36452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
This post was last modified on December 14, 2025 8:27 pm
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు…
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్…