తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీనివ్వలేకపోయింది. 312 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన 93 మంది అభ్యర్థులు గెలిచారు. మరో 250 స్థానాల్లో ఇతరులు, ఇండిపెండెంట్లు, రెబల్స్ విజయం సాధించారు.
రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో ఓటు వేసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండో విడత పోలింగ్ లో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 29917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మూడో దశ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. మూడో దశలో182 మండలాల్లోని 4159 గ్రామాలు, .36452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
This post was last modified on December 14, 2025 8:27 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…