తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీనివ్వలేకపోయింది. 312 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన 93 మంది అభ్యర్థులు గెలిచారు. మరో 250 స్థానాల్లో ఇతరులు, ఇండిపెండెంట్లు, రెబల్స్ విజయం సాధించారు.
రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో ఓటు వేసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండో విడత పోలింగ్ లో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 29917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మూడో దశ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. మూడో దశలో182 మండలాల్లోని 4159 గ్రామాలు, .36452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
This post was last modified on December 14, 2025 8:27 pm
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…