తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీనివ్వలేకపోయింది. 312 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన 93 మంది అభ్యర్థులు గెలిచారు. మరో 250 స్థానాల్లో ఇతరులు, ఇండిపెండెంట్లు, రెబల్స్ విజయం సాధించారు.
రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో ఓటు వేసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండో విడత పోలింగ్ లో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 29917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మూడో దశ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. మూడో దశలో182 మండలాల్లోని 4159 గ్రామాలు, .36452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…