Political News

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించిన సీఎం చంద్ర‌బాబు.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికి మూడు సార్లు రైతుల‌తో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, మంత్రి నారాయ‌ణ‌ల నేతృత్వంలోని క‌మిటీ భేటీ అయింది. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీలు కూడా ఇచ్చింది. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇవీ స‌మ‌స్య‌లు-ప‌రిష్కారాలు..

+ గ‌తంలో రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌కు కేటాయించిన ప్లాట్ల‌ను చూపించ‌లేద‌న్న వాద‌న ఉంది. దీనికి త్రిస‌భ్య క‌మిటీ ప‌రిష్కారం చూపించింది. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే చూపించ‌లేదని.. మిగిలిన వారికి ప్లాట్ల‌ను ఎలాట్ చేసింది.

+ భూ స‌మీక‌ర‌ణ చేయ‌ని ప్రాంతాల్లో కూడా రైతుల‌కు ప్లాట్లు కేటాయించారు. దీనిపై రైతులు ఆవేద‌న వ్యక్తం చేశారు. తాజాగా ఈ స‌మ‌స్య‌కు కూడా ప‌రిష్కారం చూపారు. భూ స‌మీక‌ర‌ణ త్వ‌ర‌లోనే పూర్త‌వుతుందని.. ఒక వేళ భూస‌మీక‌ర‌ణ చేయ‌ని ప‌క్షంలో సేక‌ర‌ణ ద్వారా అయినా.. భూములు తీసుకుని.. రైతుల‌కు ప్లాట్లు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.

+ ప్లాట్ల రిజ‌ర్వేష‌న్లపైనా రైతులు ఆందోళ‌న‌గా ఉన్నారు. దీనికి కూడా ప‌రిష్కారం చూపిన త్రిస‌భ్య క‌మిటీ.. 7 వేల మంది రైతుల‌కు సంబంధించి మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ పెండింగులో ఉంద‌ని..మిగిలిన వారికి రిజిస్ట్రేష‌న్ చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబందించి స్లాట్లు బుకింగ్ ప్రారంభించామ‌న్నారు.

+ రాజ‌ధాని రైతుల ప‌రిష్కారానికి 24/7 అందుబాటులో ఉండేలా కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎప్పుడు ఏ స‌మ‌స్య‌పై వ‌చ్చినా.. వారి నుంచి విన్న‌పాలు తీసుకుంటారు. గ‌రిష్ఠంగా మూడు రోజుల్లోనే వాటిని ప‌రిష్క‌రిస్తారు.

+ జ‌రీబు, లంక భూముల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నెల రోజుల టైమ్‌ పెట్టారు. నెల రోజుల్లో వాటిని కూడా ప‌రిష్క‌రిస్తామ‌ని క‌మిటీ హామీ ఇచ్చింది.

+ ముఖ్యంగా వాస్తు ప్ర‌కారం.. అనుకూలంగా ఉండే భూములు కేటాయించాల‌ని రైతులు కోర‌గా.. అది సాధ్యం కాద‌ని క‌మిటీ తేల్చేసింది. వాస్తు ప్ర‌కారం భూములుకేటాయించ‌లేమ‌ని .. ఈ స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టాలని తేల్చి చెప్పింది. మొత్తంగా.. అమ‌రావ‌తి రైతులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న స‌మ‌స్య‌ల‌ను త్రిస‌భ్య క‌మిటీ దాదాపు ప‌రిష్క‌రించింది. 

This post was last modified on December 13, 2025 4:11 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

14 hours ago