“తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం.” ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండాపోయింది. కేవలం ఒకరిద్దరు నాయకుల మధ్య బంధీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఎవరికివారు పెద్దలుగా మారి పార్టీ లైన్ను విస్మరించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండిపై ప్రయోగాలు చేస్తోంది.
ఈ విషయాన్ని ఎవరికైనా ఇష్టం ఉన్నా కష్టంగా అనిపించినా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత ఆరు నెలల క్రితమే చెప్పారు. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆయనను బయటకు వెళ్లేలా చేశారన్న వాదన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని వరకూ రాష్ట్ర రాజకీయాలు చేరి ప్రశ్నలు తలెత్తే దాకా రావడం వెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించిన పార్టీ ఆ దిశగా అడుగులు వేయడంలో తడబడుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు ఉన్న వేగం మరియు రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. పార్టీ అధిష్టానం చీఫ్ను మార్చినా తెర వెనుక సాగుతున్న ఆధిపత్య రాజకీయాలను మాత్రం తగ్గించలేకపోయింది. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా లేదు. కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్, బండి సంజయ్, మాధవీలత, కిషన్ రెడ్డి వంటి కొద్దిమంది మాత్రమే బీజేపీలో నాయకత్వంగా ముందుకు వస్తున్నారు. క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు మరియు నాయకులను సమన్వయం చేయడంలో విఫలమవడం పార్టీకి నష్టాలుగా మారుతోంది. ఈ కారణంగానే పార్టీ దెబ్బతింటోందన్న వాదన నిజమే. ఇదే విషయాన్ని అప్పుడే రాజాసింగ్ చెప్పారు. ఒక్కరికోసం పార్టీనా లేక అందరికోసం పార్టీనా అని ప్రశ్నించారు. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విషయం ప్రధాని దాకా చేరే వరకు నాయకులు ఏం చేశారన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పటికైనా పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…