ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నాడియాలోని కృష్ణనగర్లో గురువారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె బీజేపీ, ఎన్నికల కమిషన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగించేందుకు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ… కలెక్టర్లపై ఒత్తిడి పెంచి కోటి యాభై లక్షల పేర్లు జాబితా నుంచి తీసివేయాలని చూస్తున్నారని వెల్లడించారు. బీహార్లో చేసినట్టు బెంగాల్లో అలాంటి ప్రయత్నాలు అసాధ్యమని స్పష్టం చేశారు. ఓటర్ల పేర్లు కట్ చేస్తే మహిళలే ముందుండాలని పిలుపునిచ్చారు. “మీ హక్కులు లాక్కుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇంట్లో ఉన్న వంట సామగ్రి ఉన్నాయిగా… వాటితోనే ముందుకు వచ్చి పోరాడండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హోంమంత్రి అమిత్ షాపై కూడా మమత విరుచుకుపడ్డారు. ఆయన రెండు కళ్లూ బెంగాల్కు అపశకునమని, ఒక కంటిలో దుర్యోధన, మరో కంటిలో దుశ్శాసన కనిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఎన్ఆర్సీ, డిటెన్షన్ క్యాంపులు ఉండవని స్పష్టం చేసిన ఆమె… బీజేపీ ఐటీ సెల్ ప్రభావంతోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా తయారవుతోందని ఆరోపించారు. ఎన్నికల దగ్గర్లో ఓట్లు చీల్చే డ్రామాలు మొదలు పెడతారని, అలాంటి వాటిని ఎవరూ నమ్మకూడదని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…