Political News

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి రామ‌కృష్ణ‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌కు.. జంట హ‌త్య‌ల కేసులో కోర్టు.. 14 రోజ‌లు రిమాండ్ విధించింది. దీంతో వారిద్ద‌రినీ నెల్లూరు జైలుకు త‌ర‌లించారు. మ‌రోవైపు.. ఈ ప‌రిణామాల‌పై నిశితంగా దృష్టి పెట్టి.. వెంట‌నే బెయిల్ పిటిష‌న్ మూవ్ చేయాల‌ని అనుకున్న జ‌గ‌న్‌కు కూడా షాక్ త‌గిలింది. ఇప్ప‌టికిప్పుడు బెయిల్ ఇవ్వ‌లేమని కోర్టు చెప్పింది.

ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు..

ప‌ల్నాడులోని మాచ‌ర్ల‌, వినుకొండ, గుర‌జాల, స‌త్తెన‌ప‌ల్లి వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు ఎవ‌రు గెలిచినా.. ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. పిన్నెల్లి సోద‌రుల‌దే హ‌వా న‌డిచింది. కేవ‌లం ఎమ్మెల్యేగా రామ కృష్ణారెడ్డి ఉన్నా.. ఆయ‌న ముఖ్య‌మంత్రి స్థాయిలో ఈ జిల్లాను శాసించార‌న్న వాద‌న ఉంది. అందుకే.. త‌ర‌చుగా ఇక్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాలుగా పిన్నెల్లి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ ప‌రిణామాలతో ఇత‌ర పార్టీల త‌ర‌ఫున గెలిచిన వారు కూడా మౌనం పాటించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎవ‌రు ఉన్నా.. పిన్నెల్లి వ‌ర్గం చెప్పిందే వేదం.. అన్న‌ట్టుగా రాజ‌కీయాలు ముందుకు సాగాయి. ఇదిలావుంటే, గ‌త వైసీపీ హ‌యాంలో మ‌రింత‌గా ఇక్క‌డ రాజ‌కీయాలు పెరిగాయ‌న్న‌ది వాస్త‌వం. క‌క్ష పూరిత రాజ‌కీయాల నుంచి ఆధిప‌త్య రాజ‌కీయాల ద్వారా పిన్నెల్లికి తిరుగులేకుండా పోయింది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని వేధించార‌న్న వాద‌న ఉంది.

ఈ క్ర‌మంలోనే జ‌విశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు, కోటేశ్వ‌ర‌రావుల‌ను హ‌త్య చేశార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపించారు. ఈ కేసులోనే అరెస్టు అయ్యారు. మొత్తంగా కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను మార్చే ప్ర‌య‌త్నం అయితే జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప‌ల్నాడులోనూ మార్పులు చోటు చేసుకుంటున్నారు. పిన్నెల్లి సోద‌రుల అరెస్టుతో వైసీపీకి జిల్లాపై ప‌ట్టు దాదాపు పోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. 

This post was last modified on December 11, 2025 6:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

21 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

36 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago