Political News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే, ఆయనకు కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణను కలిగించింది. కానీ, కేసు దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.

ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు తొలగించింది. అంతేకాదు, రేపు ఉదయం 11 గంటలలోపు సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు తన బాధ్యతలలో పరిధికి మించి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు పటిష్టంగా, సమర్థవంతంగా జరగాలని ఆదేశించింది. అయితే, దర్యాప్తు సందర్భంగా ప్రభాకర్ రావుకు హాని కలిగించవద్దని, ఫిజికల్ టార్చర్ చేయవద్దని సూచించింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తేనే స్వదేశానికి తిరిగి వస్తానని గతంలో ప్రభాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, దానిని హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన స్వదేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే, ఆయన విచారణకు సహకరించడం లేదని, ఐదు ఐ ఫోన్లలో రెండింటి రీసెట్ కు మాత్రమే సహకరించారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో, ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని ఆదేశించింది.

This post was last modified on December 11, 2025 4:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago