పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు అడ్డు అదుపు లేకుండా వాగేస్తుంటారు. సోషల్ మీడియా లో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంటారు. చివరికి ఆపదలో పడ్డప్పుడు ఆదుకునేవారు కరువుతారు. పార్టీ నేతలు ఆ వ్యక్తి వైపు కన్నెత్తి చూడరు. కొన్నేళ్లుగా జరుగుతున్న రాజకీయ ఉచ్చులో ఇటువంటి ఎందరో బలైపోతున్నారు.
నోరు ఉంది కదా అని అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు కటకటాల పాలవుతున్నారు. అటువంటి వారికి బెస్ట్ ఉదాహరణ ఈ బోరుగడ్డ అనిల్. వైసీపీ అనుకూలమైన వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడు. ఇలాంటివారే అన్ని పార్టీల్లో ఉంటారు.. ఏదో ఒక సమయంలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ మెప్పుకోసం పోయి చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నారు.
కొద్దిరోజుల కిందట బోరుగడ్డ అనిల్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారు అనేది పూస గుచ్చినట్లు వివరించారు. అనిల్ చెప్పిన దానిలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. గతంలో పోలీసు కస్టడీ నుంచి అతను బయటకు వస్తున్నపుడు నడవలేని స్థితిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఒక్క నేత కూడా అతనికి మద్దతుగా నోరు తెరవలేదు.
ఆ తర్వాత సుదీర్ఘ కాలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వ్యాఖ్యలు చేయడం.. ఇది గమనించిన వైసీపీ అతను తమ పార్టీ వాడు కాదంటూ తేల్చి చెప్పడం జరిగింది. పార్టీ పెద్దల మెప్పుకోసం పోయిన అనిల్ లాస్ట్ కి ఎటూ కాకుండా పోయాడు. తప్పు చేశాడు.. థర్డ్ డిగ్రీ రుచి చూశాడు అని అంతా లైట్ గా తీసుకునే పరిస్తితి వచ్చింది.
ఈ భయంకర నిజాలు తెలుసుకొని అయిన కొందరు ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ స్వార్ధం కోసమో, నాయకుల మెప్పు కోసమో మితిమీరి దూషణలు చేస్తే.. వారే కాదు, వారి కుటుంబాలు కూడా ఆ కర్మలను అనుభవించే పరిస్థితి వస్తుందని గుర్తించాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…