Political News

మైల‌వ‌రం ప్ర‌జ‌ల‌కు దేవినేనే కావాల‌ట‌.. రీజ‌నేంటంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాలు పుంజుకున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఏడాదిన్న‌ర కింద‌ట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీనికి ముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతోపాటు.. పార్టీని బ‌లోపేతం చేశారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని కుటుంబం నుంచి వ‌చ్చిన ఉమా.. పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం .. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని కూడా తీసుకువ‌చ్చింది. అయితే.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై వెల్లువెత్త‌డంతోపాటు.. మంత్రిగా బిజీగా ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉండ‌డం మైన‌స్ అయింది.

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. దీనికి వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర గాలి కూడా సోకింది. అదే స‌మయంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు.. త‌మ‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటార‌ని భావించిన క‌మ్మ వ‌ర్గం ఆయ‌న‌తో చేతులు క‌లిపి.. మొత్తానికి ఉమా ఓట‌మికి దారితీసే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఇక్క‌డ విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే సాగింది. అయితే… ఏడాదిన్న‌ర స‌మ‌యంలోనే కృష్ణ‌ప్ర‌సాద్‌పై ఇక్క‌డ వ్య‌తిరేక‌త రావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. అదే స‌మ‌యంలో త‌మ‌కు అండ‌గా ఉంటార‌ని భావించిన క‌మ్మ వ‌ర్గంలోనూ ఆయ‌న‌పై ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, కేవ‌లం జ‌గ‌న్ భ‌జ‌న చేయ‌డంతోనే ఆయ‌న స‌రిపెడుతున్నార‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటును వ్య‌తిరేకిస్తున్న ప్ర‌జ‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు. ఇక‌, వీరి వాద‌న‌ను కూడా ప్ర‌భుత్వానికి వినిపించ‌లేక మౌనం పాటిస్తున్నారు. వీటికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను కూడా ఆయ‌న పూర్తి చేయించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రోవైపు దేవినేని ఉమా.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. త‌న వ‌ల్ల జ‌రిగిన లోపాల‌ను స‌రిచేసుకునే ప్ర‌క్రియ‌కు ఆయ‌న శ్రీకారం చుట్టి.. త‌న‌కు దూర‌మైన క‌మ్మ నాయ‌కుల‌ను ఏకం చేసేందుకు , త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

ఫ‌లితంగా ఆయ‌న‌కు సానుకూల ప‌వ‌నాలు పెరిగాయి. వీటికితోడు పార్టీలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ద‌వులు కూడా ఆయ‌న‌కు ల‌భించ‌క‌పోవ‌డం సానుభూతికి దారితీసింది. ఇలా మొత్తంగా ఏడాదిన్న‌ర కాలంలోనే దేవినేని పుంజుకున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మూడున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది క‌నుక అప్ప‌టి లోగా ఆయ‌న మ‌రింత‌గా త‌న సైన్యాన్ని కూడ‌గ‌ట్టుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ఆయ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మేన‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 9, 2020 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

12 minutes ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago