Political News

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న ఈ పార్టీ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా కేంద్రం నుంచి మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌లు పంచాయ‌తీల‌కు అందాయి. ఈ నిధుల‌ను మ‌రింత స‌క్ర‌మంగా వినియోగించి.. పంచాయ‌తీల్లో మౌలిక స‌దుపాయాల‌ను పెంచాల‌ని డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు.

ఇదేస‌మ‌యంలో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను కూడా దిశానిర్దేశం చేశారు. ప‌నులు అధికారులు చేస్తారు.. మీరు ప్ర‌చారం చేయండి!. అని సూచించారు. దీనికి సంబంధించి పెద్ద రోడ్ మ్యాప్‌ను కూడా ప‌వ‌న్ నిర్దేశించారు. దీనిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని కూడా సూచించారు. త‌ద్వారా.. పంచాయ‌తీల్లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించే కార్య‌క్ర‌మాన్ని కేవ‌లం ప‌నుల‌కు స‌రిపుచ్చ‌కుండా.. ప్ర‌చారం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని నిర్ణ‌యించారు.

వైసీపీకి ప్ర‌స్తుతం పంచాయ‌తీల్లో అంతో ఇంతో బ‌లం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు బ్యాంకును ప‌రిశీలిస్తే.. పంచాయ‌తీల్లో వైసీపీ ఓటు బ్యాంకు గ‌ణ‌నీయంగా పెంచుకుంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల కంటే కూడా.. పంచాయ‌తీల్లో వైసీపీ దూసుకుపోయింది. దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీని భారీగా దెబ్బ కొట్టాలంటే.. పంచాయ‌తీల్లో దూసుకుపోవ‌డం కీల‌కమ‌ని భావిస్తున్నారు. అందుకే.. త‌ర‌చుగా పంచాయ‌తీలు, గ్రామాభ్యుద‌యం పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

దీని నుంచి వ‌చ్చిందే.. `ప‌ల్లె పండుగ‌` కార్య‌క్ర‌మం. దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. ఇప్ప‌టికే దీనిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతోపాటు.. ర‌హ‌దారులు, తాగునీరు, విద్యుత్‌, ఇంటింటికీ కుళాయిలు.. వంటి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా పంచాయ‌తీల మౌలిక స్వ‌రూపం మార్చి.. దానిని త‌మ‌కు అనుకూల ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది వైసీపీకి మైన‌స్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on December 11, 2025 10:33 am

Share
Show comments
Published by
Kumar
Tags: Janasena

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

17 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago