తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే నిబంధనలు ఉండకూడదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పవన్ ఆరోపించారు. పట్టు శాలువాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం సహా అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తిరుమల పవిత్రతను భంగం చేసే అంశాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు.
హిందువులు మెజారిటీ అని భావించడం ఒక భ్రమ మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్న హిందువులు ఏకత చూపకపోతే అన్యాయాలకు గురవుతూనే ఉంటారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, అన్ని మతాలకు సమాన గౌరవం లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…