తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే నిబంధనలు ఉండకూడదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పవన్ ఆరోపించారు. పట్టు శాలువాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం సహా అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తిరుమల పవిత్రతను భంగం చేసే అంశాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు.
హిందువులు మెజారిటీ అని భావించడం ఒక భ్రమ మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్న హిందువులు ఏకత చూపకపోతే అన్యాయాలకు గురవుతూనే ఉంటారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, అన్ని మతాలకు సమాన గౌరవం లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on December 10, 2025 8:36 pm
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…