తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే నిబంధనలు ఉండకూడదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పవన్ ఆరోపించారు. పట్టు శాలువాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం సహా అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తిరుమల పవిత్రతను భంగం చేసే అంశాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు.
హిందువులు మెజారిటీ అని భావించడం ఒక భ్రమ మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్న హిందువులు ఏకత చూపకపోతే అన్యాయాలకు గురవుతూనే ఉంటారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, అన్ని మతాలకు సమాన గౌరవం లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on December 10, 2025 8:36 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…