Political News

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామ‌న్నారు. తాజాగా అమ‌రావతి స‌చివాలయంలో వివిధ శాఖ‌ల‌ మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సును నిర్వ‌హించారు. దీనిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో మార్పులు తీసుకువ‌స్తున్న‌ట్టు చెప్పారు.

ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌ను జోన్లు, క్ల‌స్ట‌ర్లు, కారిడార్లుగా అభివృద్ది చేయ‌నున్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు అవ‌కాశం మ‌రింత పెరుగుతుంద‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు.. మంత్రులు, అధికారులు చేరువ కావాల‌న్నారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామ‌న్న సీఎం .. ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు  50 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పేదలకు పంపిణీ చేశామ‌ని వివ‌రించా రు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ఎక్కువ‌గా వివ‌రించాల‌ని సూచించారు.

ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ అని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. కానీ, గత వైసీపీ పాలన‌ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగామన్నారు. విశాఖ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని, యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు. ఇక‌, రాష్ట్రంలో ప్ర‌జల ఆదాయం పెరుగుతోంద‌ని చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ వచ్చిందన్న సీఎం.. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదు అయ్యిందని వివ‌రించారు.

వైసీపీ అలా చేసి..

వైసీపీ హ‌యాంలో విద్యుత్ ఒప్పందాలు(పీపీఎ) రద్దు చేసి త‌ప్పు చేశార‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీంతో 9 వేల కోట్ల రూపాయ‌ల‌ ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. కూటమి  వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను  5.19 రూపాయ‌ల‌ చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింద‌ని చెప్పారు. ఇప్పుడు దానిని 4.92 రూపాయ‌ల‌కు తగ్గించామ‌న్నారు.   ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించామ‌ని చెప్పారు. వ‌చ్చే  ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

32 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago