తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదు, ముంబైలో చికిత్స పొందారు. కొంతకాలంగా అడపా దడపా కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్న అంత యాక్టివ్ గా లేరు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి కొద్దిరోజుల్లో తాను పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించారు.
మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ, అటు మీడియా సమావేశాల్లోనూ చేసిన వ్యాఖ్యలను టీడీపీ పార్టీ నేతలు మర్చిపోలేకపోతున్నారు. ఆ వ్యాఖ్యలపై కొన్నిసార్లు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆయన అరెస్టు ఎంతో దూరం లేదంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన తెర వెనుకే ఉన్నారు.
ఈరోజు గుడివాడలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బైపాస్ సర్జరీ కావడం వల్ల ఆరు నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటాను. మళ్ళీ జగన్ ను సీఎం అవ్వడానికి నా వంతు కృషి చేస్తా అని వెల్లడించారు.
అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ అక్కడ అభిమానులు కొడాలి నాని గురించి అడిగారు. ఎలాంటి డౌట్ వద్దంటూ వారికి లోకేష్ వివరించారు. కొడాలి నాని రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆక్టివ్ అవుతారా..? అలా అవగానే ఆయన అరెస్టు తప్పదా..? అని తెలుగుదేశం శ్రేణులు చర్చించుకుంటున్నారు. నాని మళ్లీ రాజకీయాల్లో దూకుడుగా ఉంటారా… ? అనేది కూడా వేచి చూడాలి.
This post was last modified on December 10, 2025 2:23 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…