Political News

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా భవిష్యత్తు కోసం ఒక భారీ ఆఫర్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చడానికి ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.48 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇది మామూలు విషయం కాదు.

ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశం ఇండియాలో ‘ఏఐ ఫస్ట్ ఫ్యూచర్’ నిర్మించడం. అంటే భవిష్యత్తు అంతా ఏఐ టెక్నాలజీదే కాబట్టి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, యువతకు కావాల్సిన స్కిల్స్ నేర్పించడం, దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఈ డబ్బును ఖర్చు చేయనున్నారు. ఇండియాలో టాలెంట్ కు కొదవలేదని, దానికి సరైన సపోర్ట్ దొరికితే అద్భుతాలు సృష్టిస్తారని మైక్రోసాఫ్ట్ నమ్ముతోంది.

ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయలేదు. దీన్నిబట్టి ఇండియా మార్కెట్ మీద, ఇక్కడి గ్రోత్ మీద ఆ సంస్థకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీతో జరిగిన చర్చలు చాలా స్ఫూర్తిదాయకంగా సాగాయని, ఇండియా ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని నాదెళ్ల పేర్కొన్నారు.

ఈ విషయాన్ని సత్య నాదెళ్ల స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మోదీ గారితో మాట్లాడటం చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఇండియా ఆశయాలకు మద్దతుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఆసియాలోనే మా అతిపెద్ద పెట్టుబడిని ప్రకటిస్తున్నాం” అని ఆయన పోస్ట్ చేశారు. ఇది భారత టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

ఈ డీల్ వల్ల రాబోయే రోజుల్లో ఇండియాలో డేటా సెంటర్లు పెరగడం, లక్షలాది మందికి ఏఐ ట్రైనింగ్ దొరకడం, కొత్త ఉద్యోగాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ ఇండియాను తన పార్టనర్ గా ఎంచుకోవడం దేశ ప్రతిష్టను పెంచే అంశం.

This post was last modified on December 9, 2025 9:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Microsoft

Recent Posts

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

1 minute ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

13 minutes ago

అన్నగారికి అసలు టెన్షనే లేదు

అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…

14 minutes ago

ముందు జాగ్రత్త పడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్

ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…

1 hour ago

అర‌బిక్ భాష‌లో రామాయ‌ణం

రామాయ‌ణం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇండియాలో బ‌హు భాష‌ల్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆ క‌థ‌కు ఇప్ప‌టికీ డిమాండ్ త‌క్కువేమీ…

2 hours ago

నేరస్తులకు షాకిచ్చేలా ఏపీ పోలీసుల సరికొత్త పోలీసింగ్

కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు.. తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చొచ్చిన అంబోతుల మాదిరి…

3 hours ago