Political News

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా భవిష్యత్తు కోసం ఒక భారీ ఆఫర్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చడానికి ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.48 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇది మామూలు విషయం కాదు.

ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశం ఇండియాలో ‘ఏఐ ఫస్ట్ ఫ్యూచర్’ నిర్మించడం. అంటే భవిష్యత్తు అంతా ఏఐ టెక్నాలజీదే కాబట్టి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, యువతకు కావాల్సిన స్కిల్స్ నేర్పించడం, దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఈ డబ్బును ఖర్చు చేయనున్నారు. ఇండియాలో టాలెంట్ కు కొదవలేదని, దానికి సరైన సపోర్ట్ దొరికితే అద్భుతాలు సృష్టిస్తారని మైక్రోసాఫ్ట్ నమ్ముతోంది.

ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయలేదు. దీన్నిబట్టి ఇండియా మార్కెట్ మీద, ఇక్కడి గ్రోత్ మీద ఆ సంస్థకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీతో జరిగిన చర్చలు చాలా స్ఫూర్తిదాయకంగా సాగాయని, ఇండియా ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని నాదెళ్ల పేర్కొన్నారు.

ఈ విషయాన్ని సత్య నాదెళ్ల స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మోదీ గారితో మాట్లాడటం చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఇండియా ఆశయాలకు మద్దతుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఆసియాలోనే మా అతిపెద్ద పెట్టుబడిని ప్రకటిస్తున్నాం” అని ఆయన పోస్ట్ చేశారు. ఇది భారత టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

ఈ డీల్ వల్ల రాబోయే రోజుల్లో ఇండియాలో డేటా సెంటర్లు పెరగడం, లక్షలాది మందికి ఏఐ ట్రైనింగ్ దొరకడం, కొత్త ఉద్యోగాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ ఇండియాను తన పార్టనర్ గా ఎంచుకోవడం దేశ ప్రతిష్టను పెంచే అంశం.

This post was last modified on December 9, 2025 9:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Microsoft

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago