అమెరికాలో ప్రఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన శాన్ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. తొలుత ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అమరావతి సహా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ఏపీ అభివృద్ధి బాటలో పురోగమిస్తోందని.. ఇప్పటికే పలువురు పెట్టుబడి దారులు వస్తున్నారని, ఒప్పందాలు కూడా జరిగాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఎన్నారైలతో నారా లోకేష్ భేటీ అయి .. పెట్టుబడులపై చర్చించారు.
విశాఖలో డేటా కేంద్రం వచ్చినట్టు నారా లోకేష్ వారికి తెలిపారు. దీనివల్ల లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా అమెరికాలో క్వాంటమ్ వ్యాలీకి కూడా శ్రీకారంచుట్టామన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగానే కాకుండా.. ఐటీ పరంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు ఏర్పాడ్డాయని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అమరావతి రాజధానిలో భారీ భూమి అందుబాటులో ఉందన్నారు. పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని వివరించారు.
ఐటీ సహా మౌలిక సదుపాయాల కల్పన రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఏపీలో డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్రెడ్డిని కోరారు. అదేవిధంగా ఏపీలో ప్రపంచ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని `జడ్ స్కాలర్` సీఈవో చౌదరిని కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో పరిశోధనా రంగంలో చేతులు కలపాలని `సేల్స్ ఫోర్స్` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ ను కోరారు. ఇలా.. పలువురు పెట్టుబడి దారులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయి పెట్టుబడులపై చర్చించారు.
ఎవరెవరితో బేటీ అంటే..
+ ఐటీ మౌలిక సదుపాయాలపై `ఓప్స్ ర్యాంప్` సీఈవో వర్మతో భేటీ.
+ అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని `ఆటో డెస్క్` చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్తో చర్చలు
+ ఎలక్ట్రోలైజర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు `రిగెట్టి కంప్యూటింగ్` సీటీవో డేవిడ్ రివాస్తో లోకేష్ చర్చించారు.
This post was last modified on December 9, 2025 7:08 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…