Political News

అమెరికాలోనూ ఆగని లోకేష్ పెట్టుబడుల వేట

అమెరికాలో ప్ర‌ఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ప‌ర్య‌టించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఉద‌యం ఆయ‌న శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. తొలుత ఆయ‌న ప‌లువురు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ అయ్యారు. అమ‌రావ‌తి స‌హా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని వారిని కోరారు. ఏపీ అభివృద్ధి బాట‌లో పురోగ‌మిస్తోంద‌ని.. ఇప్ప‌టికే ప‌లువురు పెట్టుబ‌డి దారులు వ‌స్తున్నార‌ని, ఒప్పందాలు కూడా జ‌రిగాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ముఖ్యంగా ఎన్నారైల‌తో నారా లోకేష్ భేటీ అయి .. పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

విశాఖ‌లో డేటా కేంద్రం వ‌చ్చిన‌ట్టు నారా లోకేష్ వారికి తెలిపారు. దీనివ‌ల్ల ల‌క్ష‌ మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయన్నారు. అదేవిధంగా అమెరికాలో క్వాంట‌మ్ వ్యాలీకి కూడా శ్రీకారంచుట్టామ‌న్నారు. ప‌ర్యాట‌కంగా, పారిశ్రామికంగానే కాకుండా.. ఐటీ ప‌రంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబ‌డులకు మ‌రిన్ని అవ‌కాశాలు ఏర్పాడ్డాయ‌ని తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో భారీ భూమి అందుబాటులో ఉంద‌న్నారు. పెట్టుబ‌డుల‌తో వ‌చ్చే వారికి అన్ని విధాలా స‌హకారం అందిస్తామ‌ని వివ‌రించారు.

ఐటీ స‌హా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. ఏపీలో డెవ‌ల‌ప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జ‌న‌ర‌ల్ శ్రీక‌ర్‌రెడ్డిని కోరారు. అదేవిధంగా ఏపీలో ప్ర‌పంచ సామ‌ర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని `జ‌డ్ స్కాల‌ర్` సీఈవో చౌద‌రిని కోరారు. క్వాంట‌మ్ కంప్యూటింగ్‌లో ప‌రిశోధ‌నా రంగంలో చేతులు క‌ల‌పాల‌ని `సేల్స్ ఫోర్స్` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ ను కోరారు. ఇలా.. ప‌లువురు పెట్టుబ‌డి దారుల‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

ఎవ‌రెవ‌రితో బేటీ అంటే..

+ ఐటీ మౌలిక సదుపాయాలపై `ఓప్స్ ర్యాంప్` సీఈవో వర్మతో భేటీ.
+ అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని `ఆటో డెస్క్` చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో చ‌ర్చ‌లు
+ ఎలక్ట్రోలైజర్ తయారీ ప‌రిశ్రమ ఏర్పాటుకు `రిగెట్టి కంప్యూటింగ్` సీటీవో డేవిడ్ రివాస్‌తో లోకేష్ చ‌ర్చించారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

4 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago