జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా వాటిని వైరల్ చేస్తుంది.
ఈ రోజు ఏపీలోని ఒక సంఘటన గురించి వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఏకంగా.. 37 జాతీయ మీడియా ఛానళ్లను టాగ్ చేసింది. ఇంత సడన్ గా అంతగా ఎందుకు గుర్తుకు వచ్చాయి అంటే..
కొద్ది రోజుల నుంచి ఇండిగో విమానాల క్రైసిస్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఒక ప్రముఖ జాతీయ చానల్లో చర్చ నడిచింది. అందులో టీడీపీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్న క్రమంలో ప్రోగ్రాం ను నడిపిస్తున్న జర్నలిస్టు దానిని అడ్డుకున్నాడు. ఇదే ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారింది. ఆ వీడియో బైట్స్ ను తెగ వైరల్ చేస్తోంది. మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ తమ అనుకూల ఛానెల్ లో డిబేట్లు కూడా పెడుతోంది. జాతీయ మీడియా కూటమి నాయకులకు అనుకూలంగా లేదు అన్నట్లు ప్రచారం చేస్తోంది.
ఈ క్రమంలోనే వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది. తిరుపతిలో ఓ యువతిపై రాపిడో డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన గురించి అందులో ఉంది. ఇలాంటి ఘోరమైన ఘటనలు ప్రస్తుతం రాష్ట్రంలో భద్రత, బాధ్యతా వ్యవస్థలు ఏ స్థాయికి పడిపోయాయో అంటూ వాపోయింది. ఈ పోస్టుకి జాతీయ మీడియా ట్విట్టర్ అకౌంట్ లను ట్యాగ్ చేసింది.
ఏపీలో జరుగుతున్న పరిణామాలలో జాతీయ మీడియా దృష్టికి తీసుకు వెళ్ళటం కారణమై ఉండవచ్చు. ఏపీలోని కొన్ని మీడియా సంస్థలపై మాజీ సీఎం వైయస్ జగన్ తరచుగా విరుచుకుపడుతుంటారు. తమ విమర్శలు జాతీయ మీడియా అయిన గుర్తిస్తుంది అనే ఆశతోనే వైసీపీ దృష్టి జాతీయ మీడియాపై పడి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…