తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరుచుకున్నామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి దూసుకుపోతున్న విదేశీ నగరాలను ప్రామాణికంగా తీసుకుని.. వాటిని అనుసరిస్తున్నామని చెప్పారు. వీటిలోనూ ప్రధానంగా చైనాలోని `గ్వాంగ్ డాంగ్`.. రాష్ట్రం అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రం కేవలం 20 ఏళ్లలో భారీ పెట్టుబడులు సాధించిందని సీఎం వివరించారు. అలానే తెలంగాణను కూడా పెట్టుబడులకు డెస్టినేషన్గా మార్చనున్నట్టు చెప్పారు.
తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సదస్సును రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్ పూర్లో ఉన్న ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. తెలంగాణ లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి దేశం ఏవిధంగా అయితే.. లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతోందో.. అలానే తెలంగాణ కూడా నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. దీనిలో భాగంగానే వచ్చే మూడేళ్లలోనే 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు.
అదేవిధంగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ లక్ష్య సాధనలో అందరినీ కలుపుకొని పోనున్నట్టు సీఎం వివరించారు. పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10శాతం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి వివరించారు. అయితే.. ఇదేమీ చిన్నలక్ష్యం కాదన్న ఆయన.. కష్టపడి సాధించాలని భావించినప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్టు సీఎం చెప్పారు. అభివృద్ధి మరింత క్షేత్రస్థాయికి చేరాలన్న లక్ష్యంతోనే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్టు తెలిపారు. ఈ మూడు జోన్లను ఇతర రంగాలకు సమన్వయం చేయడం ద్వారా.. క్యూర్, ప్యూర్, రేర్ ఫార్ములతో వాటిని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. వీటిని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలవనున్నట్టు తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని స్వయంగా చూసినట్టు తెలిపిన సీఎం .. తెలంగాణలోనూ అదే తరహా ఫార్ములాతో పెట్టుబడులను ఆహ్వానించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఇదేసమయంలో ప్రపంచంలో అభివృద్ధి సాధించిన జపాన్, జర్మనీ సహా ఇతర దేశాలను కూడా నమూనాలుగా తీసుకుంటామన్నారు.
This post was last modified on December 9, 2025 7:55 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…