Political News

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25 మంది ఎంపీల‌లోనూ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎంపీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 8.9 స్కోర్ తో పెమసాని చంద్రశేఖర్ ఫస్ట్ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆసక్తికర విషయం. గత ఎన్నికల్లో మొదటిసారి విజయం దక్కించుకున్న పెమ్మసాని ఎన్నారై నాయకుడిగా టిడిపిలో తొలిసారి అడుగు పెట్టారు.

నిజానికి ఆయనకు పార్లమెంటు రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త అనే చెప్పాలి. అయినప్పటికీ ఎంపీల అందరిలోకి మొదటి స్థానంలో నిలబడడం విశేషం. మరి దీనికి ప్రధాన కారణం రాజకీయంగా వివాదాలకు దూరంగా ఉండడం విమర్శలు చేయకపోవడం ప్రజలతో తరచుగా మమేకం కావడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ కేంద్రంలో మంత్రిగా కూడా అవకాశం లభించింది. అటు కేంద్ర మంత్రిగా ఇటు గుంటూరు పార్లమెం టు సభ్యుడిగా పెమసాని ప్రజలకు చేరువ అవుతున్నారు.

ముఖ్యంగా రాజకీయ వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. గుంటూరు రాజకీయాలు అంటేనే వివాదాలకు విమర్శలకు పెట్టింది పేరు. అదే కాదు రాజకీయ అంశాలు కూడా అనేక విభిన్నమైనవిగా తెరమీదకు వ‌స్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఆయా విమర్శలు వివాదాల జోలికి పోకుండా తనదైన శైలిలో ప్రజలకు చేరువకావడం, పార్టీకి అనుగుణంగా పనిచేయడం వంటివి ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

అదే సమయంలో మరో కీలకమైన అంశం రాజధాని. అమరావతి గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడి రైతులు ఎంపీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. పైగా కేంద్ర మంత్రిగా కూడా ఉండటంతో ప్రమాసానిపై వారికి మరిన్ని ఆశలు ఆకాంక్షలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఆయన సమన్వయం చేస్తూ రైతులతో కూడా తరచుగా భేటీ అవుతూ వారి సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం తరఫున తాను వారికి భరోసా కల్పిస్తుండడం కూడా ఆయన గ్రాఫ్‌ను పెంచిందన్న భావన వ్యక్తం అవుతుంది.

ఇక గుంటూరులో నెలకొన్న అనేక సమస్యలకు ఇటీవల కాలంలో ఎంపీగా ఆయన నిధులు కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా జోరుగా సాగేలా చేస్తున్నారు. ఫ్లై ఓవర్ల నుంచి రహదారుల వరకు గుంటూరులో నిర్మాణాలను చేపట్టారు. ఎంపీ లాడ్స్‌ నుంచి అదే విధంగా కేంద్ర నుంచి కూడా నిధులు వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజల అభిమానాన్ని పొందారనేది తాజాగా చేసిన సర్వేలో స్పష్టమైంది. దీంతోనే ఆయనకి ఏకంగా ఎవరికీ లభించనంత స్కోరు లభించింది, ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు తిరుగులేదు అన్న వాదన వినిపిస్తోంది.

This post was last modified on December 9, 2025 7:20 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago