ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి కష్టాలు తీర్చేందుకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమాన యాన సంస్థలతో భేటీ అవుతున్నారు. ఇండిగో పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రయాణికులకు రుసుములు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఇంకో వైపు రాజ్యసభలోనూ ఆయన ప్రతిపక్షాలు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదని, ప్రయాణికుల ఇబ్బందులను గమనించి ఏర్పాట్లు చేస్తున్నామని రామ్మోహన్ చెప్పారు. అంతేకాదు.. ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంస్థ అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకున్న లోటుపాట్ల కారణంగానే ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో చోటు చేసుకున్న లోపాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. ఇలా.. అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం.. మరోవైపు.. ఇండిగో విమానాల రాకపోకలు, విమానాశ్రయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిరంతరం ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు. మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదురైందని.. అయినా.. ఎంతో సమర్థవంతంగా దీనిని పరిష్కరిస్తున్నారని రామ్మోహన్ను ప్రధాని ప్రశంసించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. సమయ స్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
విమానయాన శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ఇదేసమయంలో ఆయన కీలక సూచన కూడా చేశారు. విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. “మీరు చేయాలని అనుకున్న పనిని నిర్విఘ్నంగా చేయండి. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోవద్దు. ప్రజల కోసం పనిచేసేప్పుడు.. అనేక మంది అనేకం అంటారు. వాటిని అసలు మనసులోకి తీసుకోవద్దు. గో ఎహెడ్“ అని ప్రధాని పేర్కొన్నారు.
This post was last modified on December 8, 2025 10:21 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…