Political News

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి క‌ష్టాలు తీర్చేందుకు పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. విమాన యాన సంస్థ‌ల‌తో భేటీ అవుతున్నారు. ఇండిగో ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌యాణికుల‌కు రుసుములు తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇంకో వైపు రాజ్య‌స‌భ‌లోనూ ఆయ‌న ప్ర‌తిప‌క్షాలు అడిగి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు.

ఈ విష‌యాన్ని తేలిక‌గా తీసుకోవ‌డం లేద‌ని, ప్ర‌యాణికుల ఇబ్బందుల‌ను గ‌మ‌నించి ఏర్పాట్లు  చేస్తున్నామ‌ని రామ్మోహ‌న్ చెప్పారు. అంతేకాదు.. ఇండిగో సంస్థ‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ సంస్థ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో చోటు చేసుకున్న లోటుపాట్ల కార‌ణంగానే ఇబ్బందులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌లో చోటు చేసుకున్న లోపాల‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. ఇలా.. అటు ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధానం చెప్ప‌డం.. మ‌రోవైపు.. ఇండిగో విమానాల రాక‌పోక‌లు, విమానాశ్ర‌యాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను నిరంత‌రం ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స్పందించారు. మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు ఆయ‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అత్యంత క్లిష్ట ప‌రిస్థితి ఎదురైంద‌ని.. అయినా.. ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా దీనిని ప‌రిష్క‌రిస్తున్నార‌ని రామ్మోహ‌న్‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు. ప్ర‌యాణికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. సమ‌య స్ఫూర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కొనియాడారు.  

విమాన‌యాన శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న కీల‌క సూచ‌న కూడా చేశారు. విప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. “మీరు చేయాల‌ని అనుకున్న ప‌నిని నిర్విఘ్నంగా చేయండి. ఎవ‌రో ఏదో అన్నార‌ని మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేప్పుడు.. అనేక మంది అనేకం అంటారు. వాటిని అస‌లు మ‌న‌సులోకి తీసుకోవ‌ద్దు. గో ఎహెడ్‌“ అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago