ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి కష్టాలు తీర్చేందుకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమాన యాన సంస్థలతో భేటీ అవుతున్నారు. ఇండిగో పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రయాణికులకు రుసుములు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఇంకో వైపు రాజ్యసభలోనూ ఆయన ప్రతిపక్షాలు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదని, ప్రయాణికుల ఇబ్బందులను గమనించి ఏర్పాట్లు చేస్తున్నామని రామ్మోహన్ చెప్పారు. అంతేకాదు.. ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంస్థ అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకున్న లోటుపాట్ల కారణంగానే ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో చోటు చేసుకున్న లోపాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. ఇలా.. అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం.. మరోవైపు.. ఇండిగో విమానాల రాకపోకలు, విమానాశ్రయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిరంతరం ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు. మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదురైందని.. అయినా.. ఎంతో సమర్థవంతంగా దీనిని పరిష్కరిస్తున్నారని రామ్మోహన్ను ప్రధాని ప్రశంసించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. సమయ స్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
విమానయాన శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ఇదేసమయంలో ఆయన కీలక సూచన కూడా చేశారు. విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. “మీరు చేయాలని అనుకున్న పనిని నిర్విఘ్నంగా చేయండి. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోవద్దు. ప్రజల కోసం పనిచేసేప్పుడు.. అనేక మంది అనేకం అంటారు. వాటిని అసలు మనసులోకి తీసుకోవద్దు. గో ఎహెడ్“ అని ప్రధాని పేర్కొన్నారు.
This post was last modified on December 8, 2025 10:21 pm
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…
మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి,…