వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం కాదు. గత ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన అనేక మంది వారసులు విజయం సాధించారు. శ్రీకాళహస్తి, నగరి, మంగళగిరి వంటి నియోజకవర్గాలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి.
ఇక వచ్చే ఎన్నికల్లోనూ వారసుల ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్, నాని ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారని సీతారాం చెప్పారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటం, జగన్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో తమ్మినేనియే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికలకు ముందుగా మాత్రం మార్పు దిశగా అడుగులు వేయాలని ఈ కుటుంబం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి నాగ్ రాజకీయ ప్రమోషన్ పై దృష్టి పెంచారు. యూట్యూబ్ ఛానళ్లు సహా పలు మీడియా సంస్థలను ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఆయన వ్యవహరిస్తున్న తీరు వ్యక్తిగత ఇమేజ్ కు పెద్దగా ఉపయోగపడడం లేదని రాజకీయ వర్గాల అభిప్రాయం.
యువ నాయకుడిగా ప్రజలను చేరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చిరంజీవి నాగ్ మాత్రం ఆన్లైన్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలకే పరిమితం అవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చాలా తక్కువగా కనిపిస్తోంది.
ఇక తమ్మినేని సీతారాం ఆరోగ్యం బాగోలేకపోవడంతో, ఆముదాలవలస లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే విషయంలో వైసీపీ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
This post was last modified on December 7, 2025 1:19 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…