వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం కాదు. గత ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన అనేక మంది వారసులు విజయం సాధించారు. శ్రీకాళహస్తి, నగరి, మంగళగిరి వంటి నియోజకవర్గాలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి.
ఇక వచ్చే ఎన్నికల్లోనూ వారసుల ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్, నాని ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారని సీతారాం చెప్పారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటం, జగన్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో తమ్మినేనియే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికలకు ముందుగా మాత్రం మార్పు దిశగా అడుగులు వేయాలని ఈ కుటుంబం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి నాగ్ రాజకీయ ప్రమోషన్ పై దృష్టి పెంచారు. యూట్యూబ్ ఛానళ్లు సహా పలు మీడియా సంస్థలను ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఆయన వ్యవహరిస్తున్న తీరు వ్యక్తిగత ఇమేజ్ కు పెద్దగా ఉపయోగపడడం లేదని రాజకీయ వర్గాల అభిప్రాయం.
యువ నాయకుడిగా ప్రజలను చేరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చిరంజీవి నాగ్ మాత్రం ఆన్లైన్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలకే పరిమితం అవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చాలా తక్కువగా కనిపిస్తోంది.
ఇక తమ్మినేని సీతారాం ఆరోగ్యం బాగోలేకపోవడంతో, ఆముదాలవలస లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే విషయంలో వైసీపీ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
This post was last modified on December 7, 2025 1:19 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…