భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ మారకం విలువను పోల్చుకుంటాయి. దీని ఆధారంగానే ఎగుమతులు-దిగుమతులు కూడా జరుగుతాయి. దాదాపు వీటి ఆధారంగానే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా ఆధార పడి ఉంటుంది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్త కూడా… దీనికి ప్రత్యామ్నాయం ఏమీ కాదు. ప్రపంచ దేశాల పరిణామాలపైనే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది.
తాజాగా అమెరికా డాలరుతో పోల్చుకుంటే.. భారత కరెన్సీ దారుణంగా పడిపోయింది. 90.71 రూపాయలకు తగ్గిపోయింది. అంటే.. ఒక డాలరుకు మన భారత కరెన్సీలో రూ.90.71 చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా పరిస్థితి ఇప్పటి వరకు లేదు. పైగా ఇదే తొలిసారి అని, ఇంత దారుణ పతనాన్ని చవిచూడడం రికార్డేనని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ఇదే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
అయితే.. ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తనదైన శైలిలో విశ్లేషించారు. రూపాయి విలువ పతనమైనప్పటికీ.. మన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం లేదన్నారు. పైగా ఎగుమతుల ద్వారా మనకు అధిక ఆదాయం సమకూరుతుందని చెప్పుకొచ్చారు. కానీ.. భారత్ నుంచి ప్రపంచ దేశాలకు జరుగుతున్న ఎగుమతులు.. గత ఐదేళ్లలో భారీగా తగ్గాయన్నది నిపుణులు చెబుతున్న మాట.
ముఖ్యంగా జీఎస్టీ శ్లాబులు మార్చిన తర్వాత.. స్వదేశీ వస్తు వినిమయానికి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ఎగుమతులు క్షీణించాయి. దీంతో సీతారామన్ చెబుతున్న ఫార్ములా సరైనదేనా? అనేది సందేహం. మరీ ముఖ్యంగా చమురు, క్రూడాయిల్, పామాయిల్ సహా ఇతర చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితే ఉంది. అదేవిధంగా విమాన ఇంధనం కూడా దిగుమతిపైనే ఆధారపడి ఉంది.
ఈ నేపథ్యంలో దిగుమతుల ధరలు చుక్కలు తాకుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవన్నది వారి మాట. ఈ నేపథ్యంలో కేంద్రం ఉపశమనాలు ప్రకటించేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగానే ఆర్బీఐ తాజాగా రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 6, 2025 8:42 pm
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…