ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని భారత్పై ఒత్తిడి తెస్తున్న అగ్రరాజ్యానికి తనదైన శైలిలో చురకలు అంటించారు. రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన, ఇండియా టుడేతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
అమెరికా ద్వంద్వ వైఖరిని పుతిన్ ఎండగట్టారు. “అమెరికా తన అణు విద్యుత్ కేంద్రాల కోసం మా దగ్గరి నుంచే న్యూక్లియర్ ఇంధనాన్ని కొంటోంది. అది కూడా ఇంధనమే కదా? మరి వాళ్లకు మా సరుకు కొనుక్కునే హక్కు ఉన్నప్పుడు, భారత్కు ఎందుకు ఉండకూడదు?” అని పుతిన్ సూటిగా ప్రశ్నించారు. మా దగ్గర ఆయిల్ కొనొద్దని భారత్ను బెదిరించే హక్కు అమెరికాకు లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఆంక్షలు, టారిఫ్స్ పేరుతో ఒత్తిడి పెంచుతోంది. రష్యా ఆయిల్ కొనడం వల్లే మాస్కో యుద్ధానికి ఫండింగ్ వెళ్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల ఈ నెలలో భారత్ ఆయిల్ దిగుమతులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్కు మద్దతుగా నిలిచాయి.
ఇక పుతిన్ రాకతో ఢిల్లీలో స్నేహ బంధం వెల్లివిరిసింది. ప్రధాని మోదీ ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ ఎయిర్పోర్టుకు వెళ్లి పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కారులో వెళ్లి ప్రైవేట్ డిన్నర్ చేయడం వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పింది. ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినా రష్యాతో దోస్తీ తగ్గేదేలే అని మోదీ చెప్పకనే చెప్పారు.
కేవలం ఆయిల్, ఆయుధాలే కాదు.. ఇకపై వ్యాపారాన్ని అన్ని రంగాలకు విస్తరించాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే టార్గెట్. ప్రస్తుతం ఎనర్జీ మీదే నడుస్తున్న వ్యాపారాన్ని ఇతర రంగాలకు కూడా మళ్లించి, అమెరికా ఆంక్షలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి పుతిన్ పర్యటన ఆరంభంలోనే అమెరికాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది.
This post was last modified on December 5, 2025 2:04 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…