ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ జనంలోకి వస్తున్నారంటే చాలు చెట్లు నరకడం, పరదాలు కట్టడం వంటి విషయాలు అధికారులకు ఒక బిగ్ టాస్క్ గా మాదిరి ఉండేది. అయితే, ఆ విషయాన్ని వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరదాలు కట్టుకొని జనంలోకి వస్తున్నారంటూ వైసీపీ మీడియా విమర్శిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా జనంతో మమేకమైన జనసేనాని వారి నుంచి వినతులను స్వయంగా తీసుకుంటున్న ఫొటోతో వైసీపీ మీడియాకు జనసేన కౌంటర్ ఇచ్చింది. దీంతో, పరదాల్లో పవన్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ మీడియా ఇప్పుడేం అంటుందోనని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పవన్ ఎప్పుడూ ప్రజల మనిషే. ప్రజలతో కలిసిపోయి వారితోపాటు పవన్ కింద కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అటువంటి పవన్ ను వైసీపీ మీడియా విమర్శించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పంట నష్టపోయిన రైతులను బారికేడ్లు పెట్టుకొని గ్రీన్ మ్యాట్ పై నడుచుకుంటూ వెళ్లి పరామర్శించిన జగన్ కు హితవు చెప్పుకోవాలని వైసీపీ నేతలకు జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.
This post was last modified on December 4, 2025 6:35 pm
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…