Political News

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ జనంలోకి వస్తున్నారంటే చాలు చెట్లు నరకడం, పరదాలు కట్టడం వంటి విషయాలు అధికారులకు ఒక బిగ్ టాస్క్ గా మాదిరి ఉండేది. అయితే, ఆ విషయాన్ని వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరదాలు కట్టుకొని జనంలోకి వస్తున్నారంటూ వైసీపీ మీడియా విమర్శిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జనంతో మమేకమైన జనసేనాని వారి నుంచి వినతులను స్వయంగా తీసుకుంటున్న ఫొటోతో వైసీపీ మీడియాకు జనసేన కౌంటర్ ఇచ్చింది. దీంతో, పరదాల్లో పవన్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ మీడియా ఇప్పుడేం అంటుందోనని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పవన్ ఎప్పుడూ ప్రజల మనిషే. ప్రజలతో కలిసిపోయి వారితోపాటు పవన్ కింద కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

అటువంటి పవన్ ను వైసీపీ మీడియా విమర్శించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పంట నష్టపోయిన రైతులను బారికేడ్లు పెట్టుకొని గ్రీన్ మ్యాట్ పై నడుచుకుంటూ వెళ్లి పరామర్శించిన జగన్ కు హితవు చెప్పుకోవాలని వైసీపీ నేతలకు జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.

This post was last modified on December 4, 2025 6:35 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

37 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago