Political News

గూగుల్ డేటా సెంట‌ర్‌.. ఊహించ‌నంత వేగంగా!

విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించ‌ని వేగంగా ముందుకు క‌దులుతోంది. భూ సమీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 506 ఎక‌రాల‌ను గూగుల్ డేటా కేంద్రం, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా కొంత భాగాన్ని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కూడా స‌మీక‌రిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ఇచ్చిన‌ట్టుగానే ఇక్క‌డ కూడా స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న భూముల‌ను గూగుల్ డేటా కేంద్రానికి బ‌ద‌లాయించేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. తొలి విడ‌తలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ‌ భాగస్వామ్య సంస్థలకు భూములు కేటాయిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. నిర్దేశిత స‌మ‌యానికంటే కూడా ముందుగానే భూములు ఇస్తున్నామ‌ని.. కాబ‌ట్టి కార్య‌క‌లాపాలు కూడా అంతే వేగంగా ముందుకు సాగాల‌ని సంస్థ‌ల‌కు సూచించింది.

ఇదేస‌మ‌యంలో గూగుల్ డేటా కేంద్రానికి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన 22 వేల కోట్ల రూపాయ‌ల ప్రోత్సోహ‌కాల్లో త‌క్ష‌ణం ఇవ్వ‌ద‌గిన ప్రోత్సాహ‌కాల‌ను కూడా అందిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిలో భూమి ఆస్థి ప‌న్ను మిన‌హాయింపు, విద్యుత్ చార్జీలు, నీటి వ‌న‌రుల‌పై టాక్స్‌లు మిన‌హాయిస్తున్నట్టు సర్కారు స్ప‌ష్టం చేసింది. కాగా.. విశాఖ‌లో మొత్తంగా వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ల‌క్ష మందికి ఉపాధి ద‌క్కుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

గూగుల్‌ సంస్థ మొత్త‌గా 15 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. దీనిలో అదానీ భాగ‌స్వామ్య కంపెనీ లు కూడా ఉన్నాయి. వాటికి కూడా రాయితీలు ఇస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం తాజాగా స్ప‌ష్టం చేసింది.అయితే.. ఏదైనా భాగ‌స్వామ్య కంపెనీ మ‌ధ్య‌లోనే ఉప‌సంహ‌రించుకుంటే.. దాని వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాలి. అదేవిధంగా స‌ద‌రు కంపెనీకి కేటాయించిన రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా.. మొత్తంగా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే భూములు అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.

This post was last modified on December 3, 2025 5:26 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

49 minutes ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

2 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

3 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

4 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

5 hours ago