Political News

గూగుల్ డేటా సెంట‌ర్‌.. ఊహించ‌నంత వేగంగా!

విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించ‌ని వేగంగా ముందుకు క‌దులుతోంది. భూ సమీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 506 ఎక‌రాల‌ను గూగుల్ డేటా కేంద్రం, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా కొంత భాగాన్ని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కూడా స‌మీక‌రిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ఇచ్చిన‌ట్టుగానే ఇక్క‌డ కూడా స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న భూముల‌ను గూగుల్ డేటా కేంద్రానికి బ‌ద‌లాయించేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. తొలి విడ‌తలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ‌ భాగస్వామ్య సంస్థలకు భూములు కేటాయిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. నిర్దేశిత స‌మ‌యానికంటే కూడా ముందుగానే భూములు ఇస్తున్నామ‌ని.. కాబ‌ట్టి కార్య‌క‌లాపాలు కూడా అంతే వేగంగా ముందుకు సాగాల‌ని సంస్థ‌ల‌కు సూచించింది.

ఇదేస‌మ‌యంలో గూగుల్ డేటా కేంద్రానికి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన 22 వేల కోట్ల రూపాయ‌ల ప్రోత్సోహ‌కాల్లో త‌క్ష‌ణం ఇవ్వ‌ద‌గిన ప్రోత్సాహ‌కాల‌ను కూడా అందిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిలో భూమి ఆస్థి ప‌న్ను మిన‌హాయింపు, విద్యుత్ చార్జీలు, నీటి వ‌న‌రుల‌పై టాక్స్‌లు మిన‌హాయిస్తున్నట్టు సర్కారు స్ప‌ష్టం చేసింది. కాగా.. విశాఖ‌లో మొత్తంగా వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ల‌క్ష మందికి ఉపాధి ద‌క్కుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

గూగుల్‌ సంస్థ మొత్త‌గా 15 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. దీనిలో అదానీ భాగ‌స్వామ్య కంపెనీ లు కూడా ఉన్నాయి. వాటికి కూడా రాయితీలు ఇస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం తాజాగా స్ప‌ష్టం చేసింది.అయితే.. ఏదైనా భాగ‌స్వామ్య కంపెనీ మ‌ధ్య‌లోనే ఉప‌సంహ‌రించుకుంటే.. దాని వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాలి. అదేవిధంగా స‌ద‌రు కంపెనీకి కేటాయించిన రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా.. మొత్తంగా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే భూములు అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.

This post was last modified on December 3, 2025 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

46 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago