కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె పార్లమెంటుకు తన కారులో ఒక శునకాన్ని తీసుకువచ్చారు. గమనించిన భద్రతా సిబ్బంది ఆమె కారును నివాసానికి తిరిగి పంపారు. ఈ సందర్భంలో ఆమె కొంత వివరణ ఇచ్చారు. తాను ఆ కుక్కపిల్ల కనిపించిందని, రోడ్డు ప్రమాదం నుంచి రక్షించి, పార్లమెంట్కు వచ్చానని అన్నారు.
వెంటనే వెనక్కి పంపించినట్లు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. కుక్కపిల్ల సమస్య కాదు, నిజంగా కరిచే మనుషులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన చర్యను వివరిస్తూ, ‘ఏ ప్రోటోకాల్? దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉందా?’ అని ప్రశ్నించారు. ఆ కుక్క ఎవరికీ హాని చేయదని, అది కేవలం కారులో తనతో పాటు ప్రయాణించిందని తెలిపారు. దీనిపై బీజేపీ భగ్గుమంది.
రేణుక తీరుపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంట్ ను, ఎంపీలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రేణుక తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ కు రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని, రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ తనపై ప్రివిలేజ్ మోషన్ తీసుకురావాలనే సమాచారం నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. ఇదే విషయాన్ని మీడియా అడగ్గా “తీసుకురాగానే చూస్తాను… తగిన సమాధానం ఇస్తాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె భౌ భౌ’ అంటూ మీడియా ముందు రిప్లై ఇచ్చారు.
This post was last modified on December 3, 2025 12:57 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…