Political News

ఆ ముగ్గురు అనుకుంటే ప్రభుత్వంలో జరగనిది ఏది లేదు

భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిందని, తమ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచే ప్రతి పథకం ప్రారంభించామని గుర్తు చేశారు. అంతేకాదు, ఈ జిల్లా నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులుగా తన కేబినెట్ లో ఉన్నారని, వారు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు.

భట్టి విక్రమార్క ఆర్థిక శాఖా మంత్రిగా, తుమ్మల నాగేశ్వర రావు వ్యవసాయ శాఖా మంత్రిగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారని, తాను ముఖ్యమంత్రిని అయినా పాలనకు ఆయువుపట్టు వంటి శాఖలన్నీ ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే, ఈ ముగ్గురు నేతలు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఏమి కావాలన్నా అడిగిందే తడవుగా నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఖమ్మం ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని, డబ్బుకో, మందుకో ఓటేస్తే గ్రామాలు మునుగుతాయని హితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిదని, 1969 తెలంగాణ ఉద్యమానికి పునాది పాల్వంచ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.

This post was last modified on December 3, 2025 9:05 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

28 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

38 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

3 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago