భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిందని, తమ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచే ప్రతి పథకం ప్రారంభించామని గుర్తు చేశారు. అంతేకాదు, ఈ జిల్లా నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులుగా తన కేబినెట్ లో ఉన్నారని, వారు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు.
భట్టి విక్రమార్క ఆర్థిక శాఖా మంత్రిగా, తుమ్మల నాగేశ్వర రావు వ్యవసాయ శాఖా మంత్రిగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారని, తాను ముఖ్యమంత్రిని అయినా పాలనకు ఆయువుపట్టు వంటి శాఖలన్నీ ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే, ఈ ముగ్గురు నేతలు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఏమి కావాలన్నా అడిగిందే తడవుగా నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ఖమ్మం ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి సర్పంచ్లను ఎన్నుకోవాలని, డబ్బుకో, మందుకో ఓటేస్తే గ్రామాలు మునుగుతాయని హితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిదని, 1969 తెలంగాణ ఉద్యమానికి పునాది పాల్వంచ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
This post was last modified on December 3, 2025 9:05 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…