Political News

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని ప్రాంతంలో రెండో ద‌శ భూస‌మీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసింది. అయితే..దీనికి ముందు సీఎం చంద్ర‌బాబు సంబంధిత రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రైతుల‌ను మెప్పించి.. ఒప్పించాల‌ని వారికి సూచించారు. రైతులను బెదిరించ‌డం.. రైతుల‌కు తెలియ‌కుండా భూ స‌ర్వేలు చేయ‌డం వంటివి చేయ‌రాద‌ని తేల్చి చెప్పారు.

“విష‌యంపై ముందు మీరు అవ‌గాహ‌న పెంచుకోండి. రైతుల‌కు న‌చ్చ‌జెప్పండి. అవ‌స‌ర‌మైతే.. వారి ఇళ్ల‌కు కూడా వెళ్లండి. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను వారికి చూపించండి. ఈ విష‌యంలో నామోషీ వ‌ద్దు. వారితో క‌లిసి టీ తాగండి. వారితో మ‌మేకం కండి. వారంత‌ట వారే వ‌చ్చి.. భూములు ఇచ్చేలా మీ చ‌ర్య‌లు ఉండాలి త‌ప్ప‌.. న‌యానో భ‌యానో బెదిరించి తీసుకునే కార్య‌క్ర‌మాలు చేయొద్దు. ప్ర‌తి విష‌యంలోనూ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎక్క‌డా చిన్న వివాదం, విమ‌ర్శ రావ‌డానికి వీల్లేదు.“అని సీఆర్ డీఏ అధికారుల‌కు చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అనంత‌రం.. జీవో విడుద‌ల చేశారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో భాగంగా ఇప్ప‌టికే తొలి విడత‌లో రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. ఇక‌, రాజ‌ధాని విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌రో 46 వేల ఎక‌రాలు అవ‌స‌రం అయింది. దీనిలో తొలి విడ‌త‌గా తాజాగా 16666 ఎక‌రాల భూమిని స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌)ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ను కొన్నాళ్ల కింద‌టే ఇచ్చింది. తాజాగా జీవోను విడుద‌ల చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎంతెంత భూమి అవ‌స‌ర‌మో.. తేల్చి చెప్పింది. దీనిని వివాదం చేయ‌కుండా.. రైతుల‌తో చ‌క్క‌గా మాట్లాడి.. అమ‌రావ‌తికి వారు చేస్తున్న త్యాగాల‌ను గుర్తు చేసి.. తీసుకోవాల‌ని.. అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు.

ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌?

1) వైకుంఠపురం: 1,965 ఎకరాలు
2) పెద్దమద్దూరు: 1,018 ఎకరాలు
3) యండ్రాయి: 1,879 ఎకరాలు
4) కర్లపూడి:  2,603 ఎకరాలు
5) హరిశ్చంద్రపురం: 1,448.09 ఎకరాలు
6) పెదపరిమి: 5,886.18 ఎకరాలు

This post was last modified on December 2, 2025 7:56 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

52 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago