Political News

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని ప్రాంతంలో రెండో ద‌శ భూస‌మీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసింది. అయితే..దీనికి ముందు సీఎం చంద్ర‌బాబు సంబంధిత రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రైతుల‌ను మెప్పించి.. ఒప్పించాల‌ని వారికి సూచించారు. రైతులను బెదిరించ‌డం.. రైతుల‌కు తెలియ‌కుండా భూ స‌ర్వేలు చేయ‌డం వంటివి చేయ‌రాద‌ని తేల్చి చెప్పారు.

“విష‌యంపై ముందు మీరు అవ‌గాహ‌న పెంచుకోండి. రైతుల‌కు న‌చ్చ‌జెప్పండి. అవ‌స‌ర‌మైతే.. వారి ఇళ్ల‌కు కూడా వెళ్లండి. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను వారికి చూపించండి. ఈ విష‌యంలో నామోషీ వ‌ద్దు. వారితో క‌లిసి టీ తాగండి. వారితో మ‌మేకం కండి. వారంత‌ట వారే వ‌చ్చి.. భూములు ఇచ్చేలా మీ చ‌ర్య‌లు ఉండాలి త‌ప్ప‌.. న‌యానో భ‌యానో బెదిరించి తీసుకునే కార్య‌క్ర‌మాలు చేయొద్దు. ప్ర‌తి విష‌యంలోనూ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎక్క‌డా చిన్న వివాదం, విమ‌ర్శ రావ‌డానికి వీల్లేదు.“అని సీఆర్ డీఏ అధికారుల‌కు చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అనంత‌రం.. జీవో విడుద‌ల చేశారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో భాగంగా ఇప్ప‌టికే తొలి విడత‌లో రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. ఇక‌, రాజ‌ధాని విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌రో 46 వేల ఎక‌రాలు అవ‌స‌రం అయింది. దీనిలో తొలి విడ‌త‌గా తాజాగా 16666 ఎక‌రాల భూమిని స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌)ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ను కొన్నాళ్ల కింద‌టే ఇచ్చింది. తాజాగా జీవోను విడుద‌ల చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎంతెంత భూమి అవ‌స‌ర‌మో.. తేల్చి చెప్పింది. దీనిని వివాదం చేయ‌కుండా.. రైతుల‌తో చ‌క్క‌గా మాట్లాడి.. అమ‌రావ‌తికి వారు చేస్తున్న త్యాగాల‌ను గుర్తు చేసి.. తీసుకోవాల‌ని.. అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు.

ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌?

1) వైకుంఠపురం: 1,965 ఎకరాలు
2) పెద్దమద్దూరు: 1,018 ఎకరాలు
3) యండ్రాయి: 1,879 ఎకరాలు
4) కర్లపూడి:  2,603 ఎకరాలు
5) హరిశ్చంద్రపురం: 1,448.09 ఎకరాలు
6) పెదపరిమి: 5,886.18 ఎకరాలు

This post was last modified on December 2, 2025 7:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

40 minutes ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

2 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

2 hours ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

2 hours ago

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…

3 hours ago

అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు…

3 hours ago