Political News

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని ప్రాంతంలో రెండో ద‌శ భూస‌మీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసింది. అయితే..దీనికి ముందు సీఎం చంద్ర‌బాబు సంబంధిత రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రైతుల‌ను మెప్పించి.. ఒప్పించాల‌ని వారికి సూచించారు. రైతులను బెదిరించ‌డం.. రైతుల‌కు తెలియ‌కుండా భూ స‌ర్వేలు చేయ‌డం వంటివి చేయ‌రాద‌ని తేల్చి చెప్పారు.

“విష‌యంపై ముందు మీరు అవ‌గాహ‌న పెంచుకోండి. రైతుల‌కు న‌చ్చ‌జెప్పండి. అవ‌స‌ర‌మైతే.. వారి ఇళ్ల‌కు కూడా వెళ్లండి. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను వారికి చూపించండి. ఈ విష‌యంలో నామోషీ వ‌ద్దు. వారితో క‌లిసి టీ తాగండి. వారితో మ‌మేకం కండి. వారంత‌ట వారే వ‌చ్చి.. భూములు ఇచ్చేలా మీ చ‌ర్య‌లు ఉండాలి త‌ప్ప‌.. న‌యానో భ‌యానో బెదిరించి తీసుకునే కార్య‌క్ర‌మాలు చేయొద్దు. ప్ర‌తి విష‌యంలోనూ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎక్క‌డా చిన్న వివాదం, విమ‌ర్శ రావ‌డానికి వీల్లేదు.“అని సీఆర్ డీఏ అధికారుల‌కు చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అనంత‌రం.. జీవో విడుద‌ల చేశారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో భాగంగా ఇప్ప‌టికే తొలి విడత‌లో రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. ఇక‌, రాజ‌ధాని విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌రో 46 వేల ఎక‌రాలు అవ‌స‌రం అయింది. దీనిలో తొలి విడ‌త‌గా తాజాగా 16666 ఎక‌రాల భూమిని స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌)ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ను కొన్నాళ్ల కింద‌టే ఇచ్చింది. తాజాగా జీవోను విడుద‌ల చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎంతెంత భూమి అవ‌స‌ర‌మో.. తేల్చి చెప్పింది. దీనిని వివాదం చేయ‌కుండా.. రైతుల‌తో చ‌క్క‌గా మాట్లాడి.. అమ‌రావ‌తికి వారు చేస్తున్న త్యాగాల‌ను గుర్తు చేసి.. తీసుకోవాల‌ని.. అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు.

ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌?

1) వైకుంఠపురం: 1,965 ఎకరాలు
2) పెద్దమద్దూరు: 1,018 ఎకరాలు
3) యండ్రాయి: 1,879 ఎకరాలు
4) కర్లపూడి:  2,603 ఎకరాలు
5) హరిశ్చంద్రపురం: 1,448.09 ఎకరాలు
6) పెదపరిమి: 5,886.18 ఎకరాలు

This post was last modified on December 2, 2025 7:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డైరెక్ట‌ర్ ప్రాణాల‌తో ఆడుకున్న నెట్‌ఫ్లిక్స్

బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా ప‌లు గొప్ప చిత్రాల‌తో బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు…

5 hours ago

ఎమ్మెల్యేల‌తో `ఆట‌లు`: ముహూర్తం ఫిక్స్

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలలో  కేవ‌లం చ‌ర్చ‌లు, ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల‌కు క్రీడ‌లు పోటీలు…

7 hours ago

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి.…

11 hours ago

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

13 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

13 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

15 hours ago