కోటి విద్యలు కూటి కొరకే.. అన్నట్టుగా కోటి సంతకాలు సేకరించి.. ఏపీలో వైద్య కాలేజీలను రాజకీయంగా తనవైపు తిప్పుకోవాలని భావించిన వైసీపీకి సంతకాల మాటేమో కానీ.. కోటి తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ది చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా వాటిని పూర్తి చేయడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య శాలలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
వాస్తవానికి వైసీపీ హయాంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చింది. అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం మినహా..దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఇలా.. ఏపీకి 17 కొత్త మెడికల్ కాలేజీలు దక్కాయి. వీటిలో జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు 80 శాతం మేరకు నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన 12 కాలేజీల్లో మరో మూడు 70 శాతం పనులు జరిగాయి. మిగిలి వాటిలో మాత్రం అసలు పనులు ముందుకు సాగలేదు. ఇవి చేపట్టాలంటే.. 8 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉందని కూటమి లెక్కలు తేల్చింది.
ఈ నేపథ్యంలోనే వాటిని పీపీపీ విధానంలో అబివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ, దీనికి వైసీపీ వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశ ఉద్యమం కూడా నిర్వహించింది. ఇదేసమయంలో కోటి సంతకాలు సేకరించి.. గవర్నర్ను కలిసి.. ఆయనద్వారా ప్రభుత్వాన్ని ఈ పీపీపీ విధానం నుంచి తప్పించేలా చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ క్రమంలో రెండు మాసాల కిందటే ఈ కోటి సంతకాల సేకరణకు మొగ్గు చూపారు. కానీ, ఇది ముందుకు సాగడం లేదు. ఒకే మండలంలో 50 వేల సంతకాలు చేయించడం.. ఒకే నియోజకవర్గంలో 2 లక్షల సంతకాలు తీసుకోవడం వంటివి జగన్ దృష్టికి రావడంతో దానిని రద్దు చేశారు.
దీనిలో ఏదో మతలబు ఉందని స్వయంగా జగనే గ్రహించి దానిని ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్గా సంతకాలు చేయించాలని జగన్ నాయకులను ఆదేశించారు. కానీ,ఇది కూడా ముందుకు సాగడం లేదు. తుఫాన్లు, వరదలు, రైతుల ఇబ్బందులు.. పంటల నష్టం, ఇలా..వివిధ అంశాలు తెరమీదికి రావడంతో ప్రజల నుంచి పెద్దగా ఈ వ్యవహారంపై స్పందన కనిపించలేదు. దీంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కోటి తప్పలు పడుతోంది. మరోవైపు.. గవర్నర్ అప్పాయింట్మెంటును కోరి.. ఇప్పటికి రెండు సార్లు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంతకాల సేకరణ అయ్యేదెప్పుడు? గవర్నర్ను కలిసేదెప్పుడు? అనేది వైసీపీకి కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 2, 2025 4:10 pm
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…