కోటి విద్యలు కూటి కొరకే.. అన్నట్టుగా కోటి సంతకాలు సేకరించి.. ఏపీలో వైద్య కాలేజీలను రాజకీయంగా తనవైపు తిప్పుకోవాలని భావించిన వైసీపీకి సంతకాల మాటేమో కానీ.. కోటి తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ది చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా వాటిని పూర్తి చేయడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య శాలలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
వాస్తవానికి వైసీపీ హయాంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చింది. అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం మినహా..దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఇలా.. ఏపీకి 17 కొత్త మెడికల్ కాలేజీలు దక్కాయి. వీటిలో జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు 80 శాతం మేరకు నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన 12 కాలేజీల్లో మరో మూడు 70 శాతం పనులు జరిగాయి. మిగిలి వాటిలో మాత్రం అసలు పనులు ముందుకు సాగలేదు. ఇవి చేపట్టాలంటే.. 8 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉందని కూటమి లెక్కలు తేల్చింది.
ఈ నేపథ్యంలోనే వాటిని పీపీపీ విధానంలో అబివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ, దీనికి వైసీపీ వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశ ఉద్యమం కూడా నిర్వహించింది. ఇదేసమయంలో కోటి సంతకాలు సేకరించి.. గవర్నర్ను కలిసి.. ఆయనద్వారా ప్రభుత్వాన్ని ఈ పీపీపీ విధానం నుంచి తప్పించేలా చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ క్రమంలో రెండు మాసాల కిందటే ఈ కోటి సంతకాల సేకరణకు మొగ్గు చూపారు. కానీ, ఇది ముందుకు సాగడం లేదు. ఒకే మండలంలో 50 వేల సంతకాలు చేయించడం.. ఒకే నియోజకవర్గంలో 2 లక్షల సంతకాలు తీసుకోవడం వంటివి జగన్ దృష్టికి రావడంతో దానిని రద్దు చేశారు.
దీనిలో ఏదో మతలబు ఉందని స్వయంగా జగనే గ్రహించి దానిని ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్గా సంతకాలు చేయించాలని జగన్ నాయకులను ఆదేశించారు. కానీ,ఇది కూడా ముందుకు సాగడం లేదు. తుఫాన్లు, వరదలు, రైతుల ఇబ్బందులు.. పంటల నష్టం, ఇలా..వివిధ అంశాలు తెరమీదికి రావడంతో ప్రజల నుంచి పెద్దగా ఈ వ్యవహారంపై స్పందన కనిపించలేదు. దీంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కోటి తప్పలు పడుతోంది. మరోవైపు.. గవర్నర్ అప్పాయింట్మెంటును కోరి.. ఇప్పటికి రెండు సార్లు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంతకాల సేకరణ అయ్యేదెప్పుడు? గవర్నర్ను కలిసేదెప్పుడు? అనేది వైసీపీకి కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు పరిశీలకులు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…