Political News

గ‌డువుకు ముందే.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి

సాధార‌ణంగా కేసుల నుంచి త‌ప్పించుకుంటున్న కొంద‌రు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాల‌ను కూడా విస్మ‌రిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయ‌కులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి , ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌పై జంట హ‌త్య‌ల కేసు న‌మోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల‌పాటు త‌ప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి మ‌ధ్యంత‌ర ముంద‌స్తు బెయిల్ పొందారు. అయితే.. దీనిని పోలీసులు స‌వాల్ చేయ‌డంతో రెండు రోజుల కింద‌ట సుప్రీంకోర్టు పొలీసుల ముందు లొంగిపోవాల‌ని ఆదేశించింది.

అయితే.. దీనికి రెండు వారాల స‌మ‌యం ఇచ్చింది. స‌హజంగా.. ఈ స‌మ‌యంలో త‌ప్పించుకునే అవ‌కాశం ఉన్నా.. ఎందుకో.. పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం.. స్థానిక కోర్టులో లొంగిపోయారు. పల్నాడు స్థానిక కోర్టుకు ఒంట‌రిగా వ‌చ్చిన వెంక‌ట్రామిరెడ్డి.. తాను లొంగిపోతున్న‌ట్టు చెప్పారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసులో త‌న ప్ర‌మేయం లేద‌ని..త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అయినా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టు స్పందిస్తూ.. స్థానిక పోలీసులు అత‌నిని అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించింది.

రామ‌కృష్ణారెడ్డి ఎక్క‌డ‌?

ఇక‌, ఈ జంట హ‌త్య‌ల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి కూడా లొంగిపోవాల్సి ఉంది. అన్న‌ద‌మ్ములు ఇద్దరిపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. పిన్నెల్లి మాత్రం లొంగిపోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత‌.. ఆయ‌న హైద‌రాబాద్ కానీ, బెంగ‌ళూరుకు కానీ వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, రెండు వారాల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఏడాది మేలో .. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా.. వీరిలో పిన్నెల్లి సోద‌రులు కూడా ఉన్నారు. కేసు న‌మోద‌య్యాక‌.. వీరిద్ద‌రూ ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇటీవ‌ల సుప్రీంకోర్టు వీరి ముంద‌స్తు బెయిల్‌ను రద్దు చేయ‌డంతోపాటు క‌స్టీడీలోకి తీసుకుని విచారించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

This post was last modified on December 1, 2025 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

1 hour ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

6 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

7 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

7 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

8 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

8 hours ago