Political News

గ‌డువుకు ముందే.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి

సాధార‌ణంగా కేసుల నుంచి త‌ప్పించుకుంటున్న కొంద‌రు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాల‌ను కూడా విస్మ‌రిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయ‌కులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి , ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌పై జంట హ‌త్య‌ల కేసు న‌మోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల‌పాటు త‌ప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి మ‌ధ్యంత‌ర ముంద‌స్తు బెయిల్ పొందారు. అయితే.. దీనిని పోలీసులు స‌వాల్ చేయ‌డంతో రెండు రోజుల కింద‌ట సుప్రీంకోర్టు పొలీసుల ముందు లొంగిపోవాల‌ని ఆదేశించింది.

అయితే.. దీనికి రెండు వారాల స‌మ‌యం ఇచ్చింది. స‌హజంగా.. ఈ స‌మ‌యంలో త‌ప్పించుకునే అవ‌కాశం ఉన్నా.. ఎందుకో.. పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం.. స్థానిక కోర్టులో లొంగిపోయారు. పల్నాడు స్థానిక కోర్టుకు ఒంట‌రిగా వ‌చ్చిన వెంక‌ట్రామిరెడ్డి.. తాను లొంగిపోతున్న‌ట్టు చెప్పారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసులో త‌న ప్ర‌మేయం లేద‌ని..త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అయినా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టు స్పందిస్తూ.. స్థానిక పోలీసులు అత‌నిని అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించింది.

రామ‌కృష్ణారెడ్డి ఎక్క‌డ‌?

ఇక‌, ఈ జంట హ‌త్య‌ల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి కూడా లొంగిపోవాల్సి ఉంది. అన్న‌ద‌మ్ములు ఇద్దరిపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. పిన్నెల్లి మాత్రం లొంగిపోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత‌.. ఆయ‌న హైద‌రాబాద్ కానీ, బెంగ‌ళూరుకు కానీ వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, రెండు వారాల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఏడాది మేలో .. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా.. వీరిలో పిన్నెల్లి సోద‌రులు కూడా ఉన్నారు. కేసు న‌మోద‌య్యాక‌.. వీరిద్ద‌రూ ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇటీవ‌ల సుప్రీంకోర్టు వీరి ముంద‌స్తు బెయిల్‌ను రద్దు చేయ‌డంతోపాటు క‌స్టీడీలోకి తీసుకుని విచారించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

This post was last modified on December 1, 2025 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

7 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

8 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

8 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

11 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago