Political News

మోదీ vs ప్రియాంక – ఏంటి ఈ ‘డ్రామా’ పాలిటిక్స్?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయింది. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష  పార్టీల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్ల‌మెంటులో `డ్రామాలు` చేయొద్ద‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యంగా కొత్త త‌రం ఎంపీల‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉండేలా కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని.. అరుపులు కేక‌ల‌తో నినాదాలతో స‌భాకార్య‌క్ర‌మాల‌కు అడ్డు త‌గొలద్ద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

అంతేకాదు… ప్ర‌తిప‌క్షాల‌కు స‌భ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌క‌పోతే.. త‌న వ‌ద్ద‌కు రావాల‌ని.. త‌న వ‌ద్ద కొన్ని టిప్స్‌(ఆలోచన‌లు) ఉన్నాయ‌ని.. వాటిని షేర్ చేస్తాన‌ని చెప్పారు. అంతేకానీ.. స‌భ‌లో మాత్రం గంద‌ర‌గోళం సృష్టించ‌వ‌ద్ద‌ని చెప్పారు. అయితే.. మోడీ చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఆయ‌న పార్ల‌మెంటు బ‌య‌టే ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. అస‌లు డ్రామా రాజ‌కీయాలుచేసింది.. చేసేది కూడా.. మోడీనేని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌జాస‌మస్య‌లు అంటే.. ఏంటో తాము నేర్పుతామ‌ని.. నేర్చుకోవాల‌ని మోడీకి చుర‌క‌లు అంటించారు.

దేశంలో స‌ర్ పేరుతో జ‌రుగుతున్న ఓట్ల చోరీ.. డ్రామానా? అని ప్ర‌శ్నించారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌జ‌లు నివ‌సించ‌లేక‌పోయినంత‌గా పెరిగిపోయిన కాలుష్యం డ్రామానా? అని నిల‌దీశారు. వీటిపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డ‌తామ‌ని తాము ముందుగానే నిర్ణ‌యించుకున్న‌ విష‌యం తెలుసుకుని.. వాటికి స‌మాధానం లేక‌పోవ‌డంతోనే ప్ర‌ధాన మంత్రి డ్రామా, టిప్స్ అంటూ.. వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. ఇది ప్ర‌ధాని హోదాకు త‌గ‌ని వ్యాఖ్యల‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం.. ప్ర‌తిదానినీ త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం.. ప్ర‌ధాని మోడీకి అల‌వాటైన `డ్రామాల‌`ని ప్రియాంక ఎద్దేవా చేశారు.

ఇక‌, మోడీ వ్యాఖ్య‌ల‌పై రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత‌,కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్య‌క్షుడు.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌ను ప్ర‌స్తావించ‌కుండా.. ముందుగానే త‌న వైఖ‌రిని ఏంటో ప్ర‌ధాని బ‌య‌ట పెట్టుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌ధాని భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. దీనిని ప్ర‌జ‌లంతా గ‌మ‌నించాల‌ని ఆయ‌న సూచించారు. “ప్ర‌ధాని మోడీ భావిస్తున్న‌ట్టు మేం.. ఓట‌మి నైరాశ్యంలో కూరుకుపోలేదు. మాది సుదీర్ఘ అనుభ‌వం ఉన్న పార్టీ. గెలుపు-ఓట‌ముల‌ను స‌మానంగా తీసుకుంటాం. ఇవి కాదు ముఖ్యం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ముఖ్యం“ అని ఖ‌ర్గే వ్యాఖ్యానించారు.

This post was last modified on December 1, 2025 5:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…

9 minutes ago

క్యాసినో కింగ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌వి?

`క్యాసినో కింగ్‌`గా గుర్తింపు తెచ్చుకుని వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను అక్ర‌మంగా ఆర్జించార‌న్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు బీజేపీ కీల‌క…

6 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

7 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

9 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

11 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

14 hours ago