Political News

మాన‌సిక ప్ర‌క్షాళ‌నా?.. మంత్రుల ప్రక్షాళ‌నా?

అనూహ్య విజ‌యంతో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అధికార టీఆర్ఎస్ పార్టీకి అంతే అనూహ్య‌మైన ప‌రాభ‌వం తాజా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎదురైంది. “తెలంగాణ కోసం.. తెలంగాణ బిడ్డ‌ల కోసం.. ఎంత‌కైనా సిద్ధ‌మే!” అన్న ఒక‌నాటి కేసీఆర్‌కు ఇప్ప‌టి కేసీఆర్‌కు మాట‌ల మ‌ధ్య వ్య‌త్యాసం లేక‌పోయినా.. చేత‌ల్లో స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం కొట్టొ చ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చిన ఫ‌లితంగానే ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింద‌నేది వాస్త‌వం. వ‌రుస విజ‌యాల‌తో దూకుడుమీదున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత‌.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సునాయాస‌మ‌ని అనుకున్నారు.

అయితే, బీజేపీ దూకుడుతో.. టీఆర్ఎస్ వేసుకున్న అంచ‌నాలు ఫ‌టాపంచ‌ల‌య్యాయి. అయితే.. ఇది నిజంగానే బీజేపీ దూకుడు అనాలా? లేక‌.. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌నాలా? ఇప్పుడు ఈ విష‌య‌మే టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ నుంచి కింది స్థాయి వ‌ర‌కు జ‌రుగు తున్న అంత‌ర్మ‌థ‌నంలో గ్రేట‌ర్ ప‌రాభ‌వ‌మే కీల‌క అంశంగా మారింది. ఈ క్ర‌మంలో రెండు అంశాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. ఒక‌టి పార్టీ అధినేతగా, కీల‌క నాయ‌కులుగా ఉన్న వారి మైండ్ సె ట్ మారాలా? లేక‌.. గుండుగుత్తుగా ఈ ప‌రాభ‌వాన్ని మంత్రుల‌పైనా, ఇత‌ర నేత‌ల‌పైనా నెట్టేసి త‌ప్పుకోవాలా? ఇదే కీల‌క అంశంగా అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది.

రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ అనుస‌రించిన విధానాలు.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ‌స్తున్న తీవ్ర అసంతృప్తి వంటివి ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాన్ని తారుమారు చేశాయ‌నేది వాస్త‌వం. నిజానికి బీజేపీ పుంజుకున్న‌ది అనేక‌న్నా.. టీఆర్ ఎస్‌పై ఉన్న వ్య‌తిరేక‌తే.. ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో క‌నిపించింద‌నేది వాస్త‌వం. బీజేపీ పుంజుకుని ఉంటే.. అతిర‌థ‌మ‌హార‌థులు వ‌చ్చి ప్ర‌చారం చేసిన త‌ర్వాత కూడా గ్రేట‌ర్‌లో ఏక‌ప‌క్షంగా బీజేపీ దూసుకుపోలేక పోయింది. అయితే.. పునాది గ‌ట్టి ప‌డింద‌ని ఆనందించ‌డ‌మే త‌ప్ప‌.. వాస్త‌వానికి అమిత్ షా, యోగి.. త‌దిత‌ర హేమాహేమీలు వ‌చ్చాక కూడా గ్రేట‌ర్ ప‌గ్గాలు చేప‌ట్ట‌లేదు.

అంటే.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై అసంతృప్తి(వ్య‌తిరేక‌త లేదు) ఉన్నా.. కేసీఆర్‌పై న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్నాయ‌నేందుకు గ్రేట‌ర్ ఎన్నిక‌లే రుజువు. మ‌రి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మ‌ంత్రుల‌పై భారం నెట్టేయ‌డ‌మో.. లేక‌.. కిందిస్థాయి నేత‌లు స‌రిగా ప‌నిచేయ‌లేద‌ని తీర్మానం చేయ‌డ‌మో కాదు.. ప్ర‌జ‌ల‌కోసం.. ప్ర‌జ‌ల చేత.. ఎన్నికైన ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల్లో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. వారి స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జాద‌ర్బార్‌.. వంటి కీల‌క కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 6, 2020 9:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago