Political News

కోన‌సీమ కొబ్బ‌రికి-రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధం ఏంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలోని కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొబ్బ‌రి రైతుల‌ను క‌లుసుకున్నారు. వాస్త‌వానికి కోన‌సీమ అంటేనే ‘ఏపీ కేర‌ళ‌’గా గుర్తింపు ఉంది. దీనికి కార‌ణం కొబ్బ‌రి తోట‌లే. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఉత్ప‌త్తి దేశ‌వ్యాప్తంగా ర‌వాణా అవుతుంది. అయితే.. రైతుల‌ను క‌లుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆల‌కించారు.

ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2014లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు -కోన‌సీమ కొబ్బ‌రికి లింకు ఉంద‌న్నారు. “నాటి రాష్ట్ర విభ‌జ‌న‌కు కోన‌సీమ కొబ్బ‌రి కూడా ఒక కార‌ణం” అని వ్యాఖ్యానించారు. దీనికి రీజ‌నేంటి? ఎందుకు కార‌ణ‌మైంది? అనేది ఆయ‌న వివ‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు? విష‌యం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ విశ్లేష‌కులు దీనికి 2 కార‌ణాలు చెబుతున్నారు.

1) ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రికి చెందిన ప‌లువురు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. వీరు ఆర్ధికంగా, రాజకీయంగా కూడా(అప్ప‌ట్లో) చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రోవైపు సినీ ద‌ర్శ‌కులు, న‌టులు కూడా ఎక్కువ‌గానే ఉండేవారు. దీంతో ‘ఏపీ వాళ్లు’, ‘సెటిల‌ర్లు’ మ‌న సొమ్ము తినేస్తున్నారు. మ‌నకు హ‌క్కులు, అవ‌కాశాలు లేకుండా చేస్తున్నార‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ఇది ఒక్క‌టే తెలంగాణ ఉద్య‌మానికి రీజ‌న్ కాక‌పోవ‌చ్చు. కానీ.. ప‌వ‌న్ ఉద్దేశంలో కోన‌సీమ‌, తూర్పు ప్రాంతాలు కార‌ణ‌మై ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

2) ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా అప్ప‌ట్లో అతి పెద్ద జిల్లా. దీనికి ప్ర‌ధాన ఆదాయం కోన‌సీమ కొబ్బ‌రి. అదే విధంగా రైస్ మిల్లులు. ఈ రెండు అంశాలు ఆర్థికంగా ప్ర‌భావం చూపించాయి. ఏపీకి వ‌స్తున్న ఆదాయంలో ఈ రెండు కీ రోల్ పోషించాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి ఏపీ ఆదాయాన్ని చూపించే క్ర‌మంలో కోన‌సీమ ప్రాంతం కూడా కీల‌క పాత్ర పోషించి ఉంటుంద‌న్న కోణంలోనూ ప‌వ‌న్ వ్యాఖ్యానించి ఉంటార‌న్న వాద‌న ఉంది.

ఇక‌, ఆయ‌న ఉద్దేశం ప్ర‌కారం.. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి అప్ప‌టి రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించినా.. మ‌రికొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు మాత్రం దీనికి మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న వాద‌న ఉంది. బ‌హుశ ప‌వ‌న్ ఉద్దేశంలో తూర్పు గోదావ‌రి(ప్ర‌స్తుతం మెజారిటీ ప్రాంతం కోన‌సీమ జిల్లాలో ఉంది) ప్రాంతం రాష్ట్ర విభ‌జ‌న‌కు దోహ‌ద‌ప‌డి ఉంటుంద‌న్న వాద‌న విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది.

This post was last modified on November 27, 2025 10:15 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

35 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

7 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago