Political News

కోన‌సీమ కొబ్బ‌రికి-రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధం ఏంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలోని కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొబ్బ‌రి రైతుల‌ను క‌లుసుకున్నారు. వాస్త‌వానికి కోన‌సీమ అంటేనే ‘ఏపీ కేర‌ళ‌’గా గుర్తింపు ఉంది. దీనికి కార‌ణం కొబ్బ‌రి తోట‌లే. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఉత్ప‌త్తి దేశ‌వ్యాప్తంగా ర‌వాణా అవుతుంది. అయితే.. రైతుల‌ను క‌లుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆల‌కించారు.

ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2014లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు -కోన‌సీమ కొబ్బ‌రికి లింకు ఉంద‌న్నారు. “నాటి రాష్ట్ర విభ‌జ‌న‌కు కోన‌సీమ కొబ్బ‌రి కూడా ఒక కార‌ణం” అని వ్యాఖ్యానించారు. దీనికి రీజ‌నేంటి? ఎందుకు కార‌ణ‌మైంది? అనేది ఆయ‌న వివ‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు? విష‌యం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ విశ్లేష‌కులు దీనికి 2 కార‌ణాలు చెబుతున్నారు.

1) ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రికి చెందిన ప‌లువురు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. వీరు ఆర్ధికంగా, రాజకీయంగా కూడా(అప్ప‌ట్లో) చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రోవైపు సినీ ద‌ర్శ‌కులు, న‌టులు కూడా ఎక్కువ‌గానే ఉండేవారు. దీంతో ‘ఏపీ వాళ్లు’, ‘సెటిల‌ర్లు’ మ‌న సొమ్ము తినేస్తున్నారు. మ‌నకు హ‌క్కులు, అవ‌కాశాలు లేకుండా చేస్తున్నార‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ఇది ఒక్క‌టే తెలంగాణ ఉద్య‌మానికి రీజ‌న్ కాక‌పోవ‌చ్చు. కానీ.. ప‌వ‌న్ ఉద్దేశంలో కోన‌సీమ‌, తూర్పు ప్రాంతాలు కార‌ణ‌మై ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

2) ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా అప్ప‌ట్లో అతి పెద్ద జిల్లా. దీనికి ప్ర‌ధాన ఆదాయం కోన‌సీమ కొబ్బ‌రి. అదే విధంగా రైస్ మిల్లులు. ఈ రెండు అంశాలు ఆర్థికంగా ప్ర‌భావం చూపించాయి. ఏపీకి వ‌స్తున్న ఆదాయంలో ఈ రెండు కీ రోల్ పోషించాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి ఏపీ ఆదాయాన్ని చూపించే క్ర‌మంలో కోన‌సీమ ప్రాంతం కూడా కీల‌క పాత్ర పోషించి ఉంటుంద‌న్న కోణంలోనూ ప‌వ‌న్ వ్యాఖ్యానించి ఉంటార‌న్న వాద‌న ఉంది.

ఇక‌, ఆయ‌న ఉద్దేశం ప్ర‌కారం.. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి అప్ప‌టి రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించినా.. మ‌రికొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు మాత్రం దీనికి మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న వాద‌న ఉంది. బ‌హుశ ప‌వ‌న్ ఉద్దేశంలో తూర్పు గోదావ‌రి(ప్ర‌స్తుతం మెజారిటీ ప్రాంతం కోన‌సీమ జిల్లాలో ఉంది) ప్రాంతం రాష్ట్ర విభ‌జ‌న‌కు దోహ‌ద‌ప‌డి ఉంటుంద‌న్న వాద‌న విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది.

This post was last modified on November 27, 2025 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

1 hour ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

3 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

6 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

6 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

7 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

9 hours ago