Political News

కోన‌సీమ కొబ్బ‌రికి-రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధం ఏంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలోని కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొబ్బ‌రి రైతుల‌ను క‌లుసుకున్నారు. వాస్త‌వానికి కోన‌సీమ అంటేనే ‘ఏపీ కేర‌ళ‌’గా గుర్తింపు ఉంది. దీనికి కార‌ణం కొబ్బ‌రి తోట‌లే. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఉత్ప‌త్తి దేశ‌వ్యాప్తంగా ర‌వాణా అవుతుంది. అయితే.. రైతుల‌ను క‌లుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆల‌కించారు.

ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2014లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు -కోన‌సీమ కొబ్బ‌రికి లింకు ఉంద‌న్నారు. “నాటి రాష్ట్ర విభ‌జ‌న‌కు కోన‌సీమ కొబ్బ‌రి కూడా ఒక కార‌ణం” అని వ్యాఖ్యానించారు. దీనికి రీజ‌నేంటి? ఎందుకు కార‌ణ‌మైంది? అనేది ఆయ‌న వివ‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు? విష‌యం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ విశ్లేష‌కులు దీనికి 2 కార‌ణాలు చెబుతున్నారు.

1) ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రికి చెందిన ప‌లువురు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. వీరు ఆర్ధికంగా, రాజకీయంగా కూడా(అప్ప‌ట్లో) చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రోవైపు సినీ ద‌ర్శ‌కులు, న‌టులు కూడా ఎక్కువ‌గానే ఉండేవారు. దీంతో ‘ఏపీ వాళ్లు’, ‘సెటిల‌ర్లు’ మ‌న సొమ్ము తినేస్తున్నారు. మ‌నకు హ‌క్కులు, అవ‌కాశాలు లేకుండా చేస్తున్నార‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ఇది ఒక్క‌టే తెలంగాణ ఉద్య‌మానికి రీజ‌న్ కాక‌పోవ‌చ్చు. కానీ.. ప‌వ‌న్ ఉద్దేశంలో కోన‌సీమ‌, తూర్పు ప్రాంతాలు కార‌ణ‌మై ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

2) ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా అప్ప‌ట్లో అతి పెద్ద జిల్లా. దీనికి ప్ర‌ధాన ఆదాయం కోన‌సీమ కొబ్బ‌రి. అదే విధంగా రైస్ మిల్లులు. ఈ రెండు అంశాలు ఆర్థికంగా ప్ర‌భావం చూపించాయి. ఏపీకి వ‌స్తున్న ఆదాయంలో ఈ రెండు కీ రోల్ పోషించాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి ఏపీ ఆదాయాన్ని చూపించే క్ర‌మంలో కోన‌సీమ ప్రాంతం కూడా కీల‌క పాత్ర పోషించి ఉంటుంద‌న్న కోణంలోనూ ప‌వ‌న్ వ్యాఖ్యానించి ఉంటార‌న్న వాద‌న ఉంది.

ఇక‌, ఆయ‌న ఉద్దేశం ప్ర‌కారం.. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి అప్ప‌టి రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించినా.. మ‌రికొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు మాత్రం దీనికి మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న వాద‌న ఉంది. బ‌హుశ ప‌వ‌న్ ఉద్దేశంలో తూర్పు గోదావ‌రి(ప్ర‌స్తుతం మెజారిటీ ప్రాంతం కోన‌సీమ జిల్లాలో ఉంది) ప్రాంతం రాష్ట్ర విభ‌జ‌న‌కు దోహ‌ద‌ప‌డి ఉంటుంద‌న్న వాద‌న విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది.

This post was last modified on November 27, 2025 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

56 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago