ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలోని కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరి రైతులను కలుసుకున్నారు. వాస్తవానికి కోనసీమ అంటేనే ‘ఏపీ కేరళ’గా గుర్తింపు ఉంది. దీనికి కారణం కొబ్బరి తోటలే. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తి దేశవ్యాప్తంగా రవాణా అవుతుంది. అయితే.. రైతులను కలుసుకున్న పవన్ కల్యాణ్.. వారి సమస్యలు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆలకించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజనకు -కోనసీమ కొబ్బరికి లింకు ఉందన్నారు. “నాటి రాష్ట్ర విభజనకు కోనసీమ కొబ్బరి కూడా ఒక కారణం” అని వ్యాఖ్యానించారు. దీనికి రీజనేంటి? ఎందుకు కారణమైంది? అనేది ఆయన వివరించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? విషయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయ విశ్లేషకులు దీనికి 2 కారణాలు చెబుతున్నారు.
1) ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన పలువురు.. హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీరు ఆర్ధికంగా, రాజకీయంగా కూడా(అప్పట్లో) చక్రం తిప్పుతున్నారు. మరోవైపు సినీ దర్శకులు, నటులు కూడా ఎక్కువగానే ఉండేవారు. దీంతో ‘ఏపీ వాళ్లు’, ‘సెటిలర్లు’ మన సొమ్ము తినేస్తున్నారు. మనకు హక్కులు, అవకాశాలు లేకుండా చేస్తున్నారన్న వాదన తెరమీదికి వచ్చింది. అయితే.. ఇది ఒక్కటే తెలంగాణ ఉద్యమానికి రీజన్ కాకపోవచ్చు. కానీ.. పవన్ ఉద్దేశంలో కోనసీమ, తూర్పు ప్రాంతాలు కారణమై ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు.
2) ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అప్పట్లో అతి పెద్ద జిల్లా. దీనికి ప్రధాన ఆదాయం కోనసీమ కొబ్బరి. అదే విధంగా రైస్ మిల్లులు. ఈ రెండు అంశాలు ఆర్థికంగా ప్రభావం చూపించాయి. ఏపీకి వస్తున్న ఆదాయంలో ఈ రెండు కీ రోల్ పోషించాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి ఏపీ ఆదాయాన్ని చూపించే క్రమంలో కోనసీమ ప్రాంతం కూడా కీలక పాత్ర పోషించి ఉంటుందన్న కోణంలోనూ పవన్ వ్యాఖ్యానించి ఉంటారన్న వాదన ఉంది.
ఇక, ఆయన ఉద్దేశం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారు. వాస్తవానికి అప్పటి రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా.. మరికొందరు పారిశ్రామిక వేత్తలు మాత్రం దీనికి మద్దతు ఇచ్చారన్న వాదన ఉంది. బహుశ పవన్ ఉద్దేశంలో తూర్పు గోదావరి(ప్రస్తుతం మెజారిటీ ప్రాంతం కోనసీమ జిల్లాలో ఉంది) ప్రాంతం రాష్ట్ర విభజనకు దోహదపడి ఉంటుందన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…