Political News

టీఆర్ఎస్ ను ముంచెత్తిన ‘వరద’

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను వరద సమస్య ముంచెత్తినట్లు అర్దమవుతోంది. వరద దెబ్బకు కొత్త అభ్యర్దులే కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోయారు. ఈ స్ధాయిలో తమ అభ్యర్ధులను ముంచెత్తుతుందని బహుశా అధికారపార్టీ అగ్రనేతలు కూడా ఊహించుండరు. ఎందుకంటే ఇదే సమస్య ఎన్నికల్లో చర్చకు వచ్చినపుడు బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయిన్ చేసిన కేటీయార్ కొట్టిపారేశారు.

తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే జనాలు అనుకుంటున్నది, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలే నిజాలని తేలిపోయింది. ఎందుకంటే అక్టోబర్లో కురిసి భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని 24 డివిజన్లలో బాగా దెబ్బతిన్నది. కొన్ని వందల కాలనీలు వర్షపు నీటిలో ముణిగిపోయాయి. ఈ ప్రాంతాల్లోని ఇళ్ళల్లో చాలామంది తమ ఇళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. బాధితులను పరామర్శించటానికి కానీ సమస్యల పరిష్కారానికి అధికారపార్టీ కార్పొరేటర్లు కానీ నేతలు కానీ ఎవరు అడ్రస్ కనబడేలేదు.

అయితే ఎన్నికలు ప్రకటన కాగానే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సహా యావత్ పార్టీ ప్రముఖలంతా వచ్చి వాలిపోయారు. వర్షాల కారణంగా సమస్యల్లో తమ ఖర్మానికి తమను వదిలేసి ఎన్నికలు రాగానే వచ్చిన పార్టీ, ప్రభుత్వ పెద్దలపై జనాలు విరుచుకుపడిపోయారు. ప్రచారానికి వచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలను తమ కాలనీల్లోకే జనాలు రానీయలేదు.

అప్పుడైనా జనాల్లోని ఆగ్రహాన్ని అధికారపార్టీ నేతలు అర్ధం చేసుకునుండాల్సింది. అర్ధం చేసుకోకపోగా బీజేపీ నేతలపై ఎదురుదాడులు మొదలుపెట్టారు. అలాగే బాధితులను ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకున్నట్లుగా కేటీయార్ అండ్ కో కలరింగ్ ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే వరద ప్రభావంలో టీఆర్ఎస్ ముణిగిపోయిందన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే 24 డివిజన్లలో 17 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారు.

భారీ వర్షాలకు రామాంతపూర్, హబ్సిగూడ, సుభాష్ నగర్, మల్లాపూర్, ఏఎస్ రావునగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్ నగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, హయత్ నగర్, వనస్ధలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రీనగర్ లాంటి అనేక డివిజన్లలో అధికారపార్టీ ఓడిపోయింది. బాధితులకు ప్రభుత్వం రూ. 10 ఇచ్చిందని కేసీయార్, కేటీయార్ చెప్పినా అందులో సగం కూడా బాధితులకు అందలేదట. అలాగే అభ్యర్ధులకు, మంత్రులు, ఎంఎల్ఏలకు పడకపోవటం లాంటి అనేక కారణాలతో టీఆర్ఎస్ నిండా ముణిగిపోయిందన్నది వాస్తవం.

This post was last modified on December 5, 2020 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

38 minutes ago

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…

45 minutes ago

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

5 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

6 hours ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

12 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

13 hours ago