Political News

టీఆర్ఎస్ ను ముంచెత్తిన ‘వరద’

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను వరద సమస్య ముంచెత్తినట్లు అర్దమవుతోంది. వరద దెబ్బకు కొత్త అభ్యర్దులే కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోయారు. ఈ స్ధాయిలో తమ అభ్యర్ధులను ముంచెత్తుతుందని బహుశా అధికారపార్టీ అగ్రనేతలు కూడా ఊహించుండరు. ఎందుకంటే ఇదే సమస్య ఎన్నికల్లో చర్చకు వచ్చినపుడు బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయిన్ చేసిన కేటీయార్ కొట్టిపారేశారు.

తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే జనాలు అనుకుంటున్నది, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలే నిజాలని తేలిపోయింది. ఎందుకంటే అక్టోబర్లో కురిసి భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని 24 డివిజన్లలో బాగా దెబ్బతిన్నది. కొన్ని వందల కాలనీలు వర్షపు నీటిలో ముణిగిపోయాయి. ఈ ప్రాంతాల్లోని ఇళ్ళల్లో చాలామంది తమ ఇళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. బాధితులను పరామర్శించటానికి కానీ సమస్యల పరిష్కారానికి అధికారపార్టీ కార్పొరేటర్లు కానీ నేతలు కానీ ఎవరు అడ్రస్ కనబడేలేదు.

అయితే ఎన్నికలు ప్రకటన కాగానే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సహా యావత్ పార్టీ ప్రముఖలంతా వచ్చి వాలిపోయారు. వర్షాల కారణంగా సమస్యల్లో తమ ఖర్మానికి తమను వదిలేసి ఎన్నికలు రాగానే వచ్చిన పార్టీ, ప్రభుత్వ పెద్దలపై జనాలు విరుచుకుపడిపోయారు. ప్రచారానికి వచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలను తమ కాలనీల్లోకే జనాలు రానీయలేదు.

అప్పుడైనా జనాల్లోని ఆగ్రహాన్ని అధికారపార్టీ నేతలు అర్ధం చేసుకునుండాల్సింది. అర్ధం చేసుకోకపోగా బీజేపీ నేతలపై ఎదురుదాడులు మొదలుపెట్టారు. అలాగే బాధితులను ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకున్నట్లుగా కేటీయార్ అండ్ కో కలరింగ్ ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే వరద ప్రభావంలో టీఆర్ఎస్ ముణిగిపోయిందన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే 24 డివిజన్లలో 17 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారు.

భారీ వర్షాలకు రామాంతపూర్, హబ్సిగూడ, సుభాష్ నగర్, మల్లాపూర్, ఏఎస్ రావునగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్ నగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, హయత్ నగర్, వనస్ధలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రీనగర్ లాంటి అనేక డివిజన్లలో అధికారపార్టీ ఓడిపోయింది. బాధితులకు ప్రభుత్వం రూ. 10 ఇచ్చిందని కేసీయార్, కేటీయార్ చెప్పినా అందులో సగం కూడా బాధితులకు అందలేదట. అలాగే అభ్యర్ధులకు, మంత్రులు, ఎంఎల్ఏలకు పడకపోవటం లాంటి అనేక కారణాలతో టీఆర్ఎస్ నిండా ముణిగిపోయిందన్నది వాస్తవం.

This post was last modified on December 5, 2020 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

24 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago