Political News

కొబ్బరి తోటల్లో పవన్..అరటి తోటల్లో జగన్..రైతుకు మేలు జరిగేనా..?

ఏపీలో ఇద్దరు ముఖ్య నేతలు ఈరోజు పొలం బాట పట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికార, విపక్ష నాయకులు వేరువేరుగా అన్నదాతలతో సమావేశం. అయ్యారు. శంకరగుప్తంలో సముద్రపు నీరు చేరి పాడవుతున్న కొబ్బరితోటలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కొబ్బరితోటల సమస్యల గురించి అవి దెబ్బతింటున్న పరిస్థితుల గురించి స్థానికులతో, రైతులతో, సంబంధిత అధికారాలతో మాట్లాడారు. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు. అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు.

‘నేనేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి, మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోవడానికి చూడట్లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి…’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖాముఖిలో ఆయన రైతులతో చర్చించారు. మొత్తం కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి సమావేశమే అన్నారు. మీరు ఇంత కష్టపడేది మీ బిడ్డలకోసమే.. ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ల వయస్కులే ఉండి ఉండొచ్చు. వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నాను అని పవన్ అన్నారు. మీ ఆదాయమార్గం, మీ వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు అవరోధాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా అని హామీ ఇచ్చారు.

అదే విధంగా బ్రాహ్మణపల్లి లో అరటి రైతులతో సమావేశమైన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. మా హయాంలో అరటి రైతుల కోసం రైళ్లు నడిపాం అని తెలిపారు. అనంతపురం ఢిల్లీ, తాడిపత్రి-ముంబై రైళ్లు నడిపాం. మా హయాంలో 3 లక్షల టన్నులు ఎక్స్ పోర్ట్ చేశాం.. అరటి పంటపై కేంద్ర నుంచి అవార్డులు తీసుకున్నాం.. ఇప్పుడు అరటి ఎక్స్ పోర్ట్ అనేదే జరగడం లేదు.. అని ఆయన వివరించారు. ఈ ప్రభుత్వంలో రైతు అంటే ప్రేమ లేదు. మా హయాంలో టన్ను రూ.30వేలకు పైగా పలికింది.. ఇప్పుడు రూ.2వేలకు కూడా కొనేవాడు లేడు అని జగన్ ఆరోపించారు. మొత్తం మీద ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పొలాల్లో పర్యటించడం ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది.

This post was last modified on November 26, 2025 1:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

9 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

10 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

11 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

13 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

13 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

14 hours ago