Political News

‘క్రిక్ ఇన్ఫో’పై కోహ్లి అభిమానుల ఫైర్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి.

ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో మాత్రం కోహ్లి వెనుకబడటం.. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ విజేతగా నిలవడం విరాట్ అభిమానులకు నచ్చలేదు.

దీంతో ‘షేమ్ ఆన్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోల్ విషయంలో క్రిక్ ఇన్ఫో మానుపులేషన్ చేసిందని.. ఫలితాలు మార్చి తాము అనుకున్న ప్రకారం పోల్ ఫలితాల్ని ప్రకటించిందని కోహ్లి అభిమానులు ఆరోపిస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో క్రికెట్ అభిమానుల్ని ఎంగేజ్ చేయడం కోసం ‘క్రిక్ ఇన్ఫో’ సోషల్ మీడియా ద్వారా రకరకాల పోల్స్, కాంటెస్టులు పెడుతోంది. ఇందులో భాగంగా ఫలానా ప్రమాణాలు అని చెప్పకుండా ‘విరాట్ కోహ్లి ఆర్ క్రిస్ గేల్’ అంటూ పోల్ పెట్టింది ఆ వెబ్ సైట్. లక్షా 30 వేల మంది దాకా ఈ పోల్ లో పాల్గొన్నారు.

ఐతే ఫలితాల ప్రకటనకు ‌కొంత సమయానికి ముందు ఈ పోల్‌లో 51 శాతం మంది కోహ్లికి ఓటేసినట్లు.. గేల్‌కు 49 శాతం ఓట్లు పడ్డట్లు చూపించింది క్రిక్ ఇన్ఫో. కానీ తర్వాత మాత్రం పోల్‌లో గేల్ గెలిచినట్లు ప్రకటించింది. దీంతో కోహ్లి అభిమానులకు మండిపోయింది. గేల్‌ను విజేతగా ప్రకటించాలని ముందే ఫిక్సయినపుడు ఇలా పోల్ పెట్టడం ఎందుకు అంటూ క్రిక్ ఇన్ఫో సైట్‌ మీద పడ్డారు. ‘షేమ్ ఆన్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో’ హ్యాష్ ట్యాగ్‌తో లక్షల మంది ట్వీట్లు వేసి.. ఆ సైట్‌ను తిట్టిపోస్తున్నారు.

This post was last modified on May 2, 2020 4:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kohli

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

7 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

32 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

34 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago